Begin typing your search above and press return to search.

‘ఒక్క అమ్మాయి తప్ప’ అంటున్న సందీప్

By:  Tupaki Desk   |   16 Feb 2016 3:30 PM GMT
‘ఒక్క అమ్మాయి తప్ప’ అంటున్న సందీప్
X
రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకు సినీ విమర్శకుల నుంచి అన్ని ప్రశంసలు అందాయంటే దానికి కారణం... అవన్నీ ఆ పాత్రను తీర్చిదిద్దిన రైటర్ కే చెందుతుంది. అలాంటి పవర్ ఫుల్ పాత్రను అంతబాగా తీర్చిదిద్దిన రైటర్ రాజసింహా ఇప్పుడు మోగా ఫోన్ పట్టాడు. అతని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ప్ర‌స్థానం' లాంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన హీరో సందీప్‌ కిష‌న్‌. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌' - 'టైగ‌ర్' లాంటి చిత్రాల‌తో మంచి స‌క్సెస్‌ లు సాధించారు. నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. వీరి కాంబినేషన్ ఈ చిత్రానికి ఒక స్పెషల్ హైలైట్ అవుతుంది అని డైరెక్టర్ రాజ‌సింహ తాడినాడ భావిస్తున్నారు. ‘ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఒక మూడు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఇందులో ఒక పాటను మన దేశం లో, మరొక రెండు పాటలను విదేశాలలో చిత్రీకరిస్తామని’ నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ బోగాది అంజిరెడ్డి అన్నారు.

అయన గతం లో 'సినిమా చూపిస్త‌మావ' చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసందే. "ఇది ఒక డిఫ‌రెంట్ బ్యాక్‌ డ్రాప్‌ తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ' ఒక్క అమ్మాయి త‌ప్ప' చిత్రం నిర్మిస్తున్నాం. దీని కాప్షన్ "All Indians are My Brothers and Sisters" అని ఆయన అన్నారు. హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేనొక తెలివైన కాలేజ్‌ కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తోంది. మా కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా నిలుస్తుంది ’’ అన్నారు. దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ ‘‘ దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. ఇందులో సుమారు ఒక గంట ముప్పై నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటుంది. కొత్త బ్యాక్‌ డ్రాప్‌ లో నడిచే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సందీప్‌ కొత్త‌గా క‌నిపిస్తాడు. రవి కిషెన్ నటన చాలా బాగుంది. చోటా కే నాయుడు అద్భుతమైన కెమెరా వర్క్ తో చిత్రానికి మంచి లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చారు. ’’ అన్నారు.