Begin typing your search above and press return to search.

శ్రీవల్లి చనిపోయింది... అసలు విషయం ఏంటంటే!

By:  Tupaki Desk   |   8 July 2022 6:31 AM GMT
శ్రీవల్లి చనిపోయింది... అసలు విషయం ఏంటంటే!
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప 2 సినిమా ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయ్యి సగానికి పైగా షూటింగ్‌ ముగించుకోవాల్సి ఉంది. కానీ పుష్ప 1 కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో పుష్ప 2 విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పుష్ప 2 సినిమా కథ చర్చలు జరుగుతున్న సమయంలోనే జనాలు రకరకాలుగా పుకార్లు పుట్టించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఊహాగానాలు అల్లేశారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమాలో హీరోయిన్‌ ను ఎలా అయితే చంపేస్తారో అలాగే పుష్ప 2 లో కూడా హీరోయిన్‌ పాత్రను చంపేయబోతున్నారు అనే వార్తలు గుప్పుమన్నాయి.

శ్రీవల్ల పాత్ర కు పెద్ద గా సెకండ్‌ హాఫ్ లో ప్రాముఖ్యత ఉండదు కనుక ఆమె చనిపోయిన పర్వాలేదు అనే అభిప్రాయం కు సుకుమార్ వచ్చాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమీ ఉండబోవడం లేదు. సుకుమార్‌ ఇప్పటికే స్క్రిప్ట్‌ విషయంలో తుది నిర్ణయానికి వచ్చాడు. అల్లు అర్జున్‌ కూడా దాదాపుగా ఫైనల్‌ చేసినట్లే. జూలై లో సినిమా ను మొదలు పెట్టాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సాధ్యం కావడం లేదు. కాని అల్లు అర్జున్‌ సన్నిహితులు మాత్రం ఈ సినిమాను ఆగస్టు లో మొదలు పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు.

శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అనే వార్తలు నిజం కావు అంటూ సుకుమార్‌ టీమ్ నుండి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ ను కూడా నటింపజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే చిత్తూరు జిల్లా యాస మాట్లాడే వారి కోసం ఆడిషన్స్ ను నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ ల స్థాయి పుష్ప 2 తో మరింత పెరగడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే పుష్ప 1 సినిమా తో రష్మిక మందన్నా కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కింది. కనుక పుష్ప 2 సినిమా తో ఖచ్చితంగా శ్రీవల్లికి మరింతగా స్టార్‌ డమ్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.