Begin typing your search above and press return to search.

సాయిప‌ల్ల‌వికి లేడీ ప‌వ‌ర్ స్టార్ బిరుదిచ్చిన సుక్కూ!

By:  Tupaki Desk   |   28 Feb 2022 3:55 AM GMT
సాయిప‌ల్ల‌వికి లేడీ ప‌వ‌ర్ స్టార్ బిరుదిచ్చిన సుక్కూ!
X
సాయి ప‌ల్ల‌వి ఎక్క‌డ ఉన్నా అక్క‌డ త‌నే కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారుతోంది. త‌న ప్ర‌తిభ గురించి మాట్లాడ‌ని వారు కానీ.. త‌న డ్యాన్సుల‌ను పొగిడేయ‌ని వారు కానీ ఉండ‌రు. ఇంత‌కుముందు సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారే సాయి ప‌ల్ల‌వి ప్ర‌తిభ‌ను డ్యాన్సులను పొగిడేశారు. ఇప్పుడు సుక్కూ అంత‌టి వాడికే సాయి ప‌ల్ల‌వి క్రేజ్ చూసి మ‌తి చెడింది. లేడీ ప‌వ‌ర్ స్టార్ అంటూ త‌న‌ని కీర్తించేసి కాసేపు మాట లేకుండా వేదిక‌పై అలానే ఉండిపోయాడంటే అర్థం చేసుకోవాలి. ఇది ఎక్క‌డ త‌ట‌స్తించింది? అంటే.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో ఈ స‌న్నివేశం అంద‌రినీ ఎమోష‌న్ కి గురి చేసింది.

ప్రేమ‌మ్ మొద‌లు ఫిదా - ల‌వ్ స్టోరి- శ్యామ్ సింగరాయ్ స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. అగ్ర క‌థానాయిక‌ల‌కు లేని క్రేజ్ సాయిప‌ల్ల‌వికి ఉంది. న‌టిగా డ్యాన్స‌ర్ గా త‌న‌ని తెలుగు అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ అభిమానం ఎలాంటిదో సుక్కూ ఈ వేదిక సాక్షిగా ప్ర‌త్య‌క్షంగా చూశారు. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి- రష్మిక మందన్న - కీర్తి సురేష్ వంటి టాప్ హీరోయిన్లు హాజర‌య్యారు. వేదిక ఆద్యంతం షో స్టాప‌ర్ గా సాయిప‌ల్ల‌వి నిలిచారు.

ఇదే వేదిక‌పై ఉన్న ముఖ్య‌అతిథి సుకుమార్ సహా అందరికీ షాక్ ఇచ్చింది సాయిప‌ల్లవి. సుకుమార్ ఇలా మాట్లాడేందుకు రెడీ కాగానే అరుపులు కేరింత‌లు.. సాయి పల్లవి పేరు ప‌ల‌క‌గానే స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాసేపు మాట్లాడలేకపోయాడు. వెంటనే సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని చమత్కరించారు. ఆమెకు వచ్చిన రెస్పాన్స్ చూసి స్ట‌న్న‌యిపోయాడు. ఆ క్ష‌ణం సాయిప‌ల్ల‌వి క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. త‌న క‌ళ్లు ఎర్ర‌బార‌డం ఎమోష‌న‌ల్ అవ్వ‌డం స్ప‌ష్ఠంగా క‌నిపించింది. నిజానికి తెలుగు సినిమా హిస్ట‌రీలోనే ఇలాంటి స‌న్నివేశం వేరొకటి లేదేమో! అనేంత‌గా గొప్ప అనుభూతిని పొందింది సాయిప‌ల్ల‌వి. ఎంద‌రో గొప్ప స్టార్లు ఉన్నా కానీ త‌న‌కే ఎందుకు అంత‌టి స్పంద‌న‌? సాయిప‌ల్ల‌వి అంటేనే ఎందుకంత అభిమానం.

త‌న‌తో పాటే ఉన్న కీర్తి సురేష్.. ర‌ష్మిక కూడా క్రేజీ నాయిక‌లుగానే వెలిగిపోతున్నారు. కానీ ఆ ఇద్ద‌రికీ లేనిది సాయిప‌ల్ల‌వికి మాత్ర‌మే ఉన్న‌ది ఏంటీ? అన్న‌ది అభిమానులే చెబుతారు.

ఇక సాయి పల్లవికి ఇలాంటి అనుభ‌వాలు ఇప్పుడే కొత్త‌కాదు. మొదటిసారి అనుకోని సంఘటన కాదు. గతంలో శ్యామ్ సింఘరాయ్ ఈవెంట్ లో కూడా అదే పునరావృతమైంది. ఆమె అప్పుడు కూడా షో స్టాప‌ర్ గా నిలిచారు. ఈసారి త‌న‌తో పాటు ఇద్దరు టాప్ హీరోయిన్లు ఉన్నా త‌నే కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మార‌డం మరింత స్పష్టంగా కనిపించింది. రష్మిక మందన్న - కీర్తి సురేష్ సైతం ఇది ఊహించి ఉండ‌రు. ప్ర‌స్తుతం ఆ ముగ్గురిపైనా మీమ్స్ రెడీ అయ్యాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4న సినిమాల్లోకి రానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. శ‌ర్వానంద్ స‌హా టీమ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు.