Begin typing your search above and press return to search.

అభిమానుల అత్యుత్సాహం.. మ‌ధ్య‌లో వెళ్లిపోయిన రౌడీస్టార్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2022 11:05 AM GMT
అభిమానుల అత్యుత్సాహం.. మ‌ధ్య‌లో వెళ్లిపోయిన రౌడీస్టార్‌!
X
స్టార్ హీరోల‌పై ఫ్యాన్స్ కున్న అభిమానం కొన్ని సార్లు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్నిక‌లిగిస్తూ వుంటుంది. ఎంత‌గా వారి ప్రేమ‌ని కంట్రోల్ చేయాల‌ని ప్ర‌త్నించినా కొన్ని సార్లు హీరో వ‌ల్ల కూడా కాదు. దీంతో చేసేది లేక ఎక్క‌డా ఫ్యాన్స్ వెర్రి అభిమానంతో మీద‌ప‌డ‌తారో అని స్టార్లు మ‌ధ్య‌లోనే అక్కడి నుంచి వెనుతిర‌గాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. స‌రిగ్గా ఇదే త‌ర‌హా అనుభ‌వాన్ని రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా ముంబైలో జ‌రిగిన ఈవెంట్ లో ఎదుర్కొన్నారు. సౌత్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

`అర్జున్ రెడ్డి` సినిమాలో యూత్ ఐకాన్ గా మారిపోయి భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన స్టైల్ తో, యాటిట్యూడ్ తో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ద‌క్కించుకున్నాడు. సౌత్ లో ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడో ఇప్ప‌డు అంత‌కు మించిన క్రేజ్ ని నార్త్ లోనూ విజ‌య్ సొంతం చేసుకోవ‌డం విశేషం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌`. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఆగ‌స్టు 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ మూవీతో బాలీవుడ్ లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇస్తున్నారు.

బాలీవుడ్ లో త‌న తొలి సినిమా రిలీజ్ కు ముందే అక్క‌డ భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. `లైగ‌ర్‌` మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా న‌వీ ముంబైలోని ఓ మాల్ లో జ‌రిగిన ఓ ఈవెంట్ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. విజ‌య్ వ‌స్తున్నాడ‌ని తెలిసి మాల్ అంతా జ‌న‌సంద్రంగా మారిపోయింది. ఈ ఈవెంట్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ, హీరోయిన్ అన‌న్య పాండే సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. న‌వీ ముంబైలోని మాల్ లో విజ‌య్ దేవ‌ర‌కొండని చూసిన ఫ్యాన్స్ ఒక్క‌సారిగా వేదిక వ‌ద్ద‌కు గుంపులు గుంపులుగా దూసుకొచ్చారు. అంతే కాకుండా విజ‌య్.. విజ‌య్ అంటూ కేక‌లు వేయ‌డంతో మాల్ ఒక్కసారిగా ద‌ద్ద‌రిల్లిపోయింది.

For Video >> https://youtube.com/shorts/ckePK-nhlXc?feature=share
అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్స్ రావ‌డం.. విజ‌య్ ని ప‌మీపించాల‌ని చూడ‌టంతో అక్క‌డ ఒక్క‌సారిగా తొపులాట జ‌రిగింది. దీంతో ప‌రిస్థితి చేయిదాటి పోయేలా వుంద‌ని గ్ర‌హించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ప్ర‌శాంతంగా వుండాల‌ని రిక్వెస్ట్ చేశాడు. తాను ఇక్క‌డే వున్నాన‌ని, ద‌య‌చేసి మీరంతా తొక్కిస‌లాట లేకుండా కామ్ అవ్వాల‌ని ఫ్యాన్స్ ని కోరాడు. అయినా వారంతా అభిమానాన్ని ఆపుకోలేక‌పోవ‌డంతో అక్క‌డున్న సిబ్బంది వారిని అదుపుచేయ‌లేక‌పోయారు.

ప‌రిస్థితి అదుపు త‌ప్పేలా వుండ‌టంతో విజ‌య్ దేవ‌ర‌కొండ, అన‌న్య పాండే మ‌ధ్య‌లోనే వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఆ క్రౌడ్ ని చూసి విజ‌య్ ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాడ‌ట‌. ముంబైలో ఈ క్రేజ్ ని చూసిన వాళ్లంతా `లైగ‌ర్‌` భారీ ఓపెనింగ్స్ ని రాబ‌ట్ట‌డం ఖాయం అని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈవెంట్ నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ని ఉద్దేశించి సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశారు.

`మీ ప్రేమ నా హృద‌యాన్ని ట‌చ్ చేసింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నార‌ని ఆశిస్తున్నాను. మీ అంద‌రితో చాలా కాలం పాటు క‌ల‌సి ఉండాల‌ని అనుకుంటున్నాను. మీ అంద‌రి గురించి ఆలోచిస్తూ బెడ్ మీద‌కు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగ‌ర్‌` అంటూ ట్వీట్ చేయ‌డం విశేషం. టీజ‌ర్‌, పోస్ట‌ర్ ల‌తో సంచ‌ల‌నం సృష్టించిన `లైగ‌ర్‌` ప్ర‌స్తుతం ట్రైల‌ర్ తో మ‌రింత ర‌చ్చ చేస్తోంది. ఆగ‌స్టు 25న పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

For Video >> https://youtube.com/shorts/7UwAmk2V0Hw?feature=share