Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ షెడ్యూల్ గురించి లీకిచ్చిన పూజా

By:  Tupaki Desk   |   13 Sep 2020 11:30 AM GMT
రాధేశ్యామ్ షెడ్యూల్ గురించి లీకిచ్చిన పూజా
X
ఉన్న‌ట్టుండి ఫారిన్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకుని `రాధేశ్యామ్` చిత్ర‌బృందం వెన‌క్కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఝార్జియా వెళ్లి నాలుగు రోజులు షూటింగ్ చేసేప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్ 19 వార్త‌లు క‌ల‌క‌లం రేపాయి. షూటింగులు కుద‌ర‌దు వెంట‌నే వ‌చ్చేయ‌మ‌ని ఫిలింఛాంబ‌ర్ వాళ్లు వార్నింగ్ ఇచ్చారు. దాంతో రాధేశ్యామ్ బృందం తిరిగి వెన‌క్కి వ‌చ్చేశారు.

ఇక ఆ త‌ర్వాత సీన్ తెలిసిన‌దే. ఐదారు నెల‌లుగా షూటింగుల్లేక డార్లింగ్ ప్ర‌భాస్ .. పూజా హెగ్డే త‌దిత‌ర చిత్ర‌బృందం పూర్తిగా విసిగివేసారి పోయార‌‌ట‌. అయితే ఎట్ట‌కేల‌కు షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారన్న లీకును ఇచ్చింది పూజా. రాధే శ్యామ్ యూనిట్ చివరకు చాలా కాలం తర్వాత షూటింగ్ ను తిరిగి ప్రారంభించే ఆలోచ‌న చేయ‌డం త‌న‌కు చాలా ఉపశమనం కలిగిస్తోంద‌ని ఈ భామ తెలిపింది. మార్చిలో జార్జియా షెడ్యూల్ కి వెళ్లిన పూజా .. కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరగ‌‌డంతో మొత్తం టీమ్ భారతదేశానికి తిరిగి వచ్చింది.

పూజా తన ఇన్ ‌స్టాగ్రామ్ లో ఇదే విష‌యం పై ముచ్చ‌టించింది. ప్ర‌స్తుతం చాలా చికాకుగా మారిందని తాను మళ్లీ షూటింగు‌లో చేరడానికి వేచి ఉండలేక‌పోతున్నాన‌ని పూజా హెగ్డే తెలిపింది. తన సోషల్ మీడియా ద్వారా ఈ రోజు హైదరాబాద్ ‌కు వ‌చ్చిన విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌దుప‌రి కొద్ది రోజుల పాటు రామోజీ ఫిలింసిటీలో రాధే శ్యామ్ షూటింగ్ కొనసాగించాలని భావిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఈ మూవీతో పాటు అఖిల్ స‌ర‌స‌న పూజా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లోనూ న‌టిస్తోంది. భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో పూజా పాత్ర సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని ఇంత‌కుముందు రిలీజ్ చేసిన పోస్ట‌ర్ వెల్ల‌డించింది.