Begin typing your search above and press return to search.

కరోనా బాధితులకోసం ఆశ్రమం ప్రారంభించి.. కృతజ్ఞతలు తెలిపిన స్టార్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   28 May 2021 12:30 AM GMT
కరోనా బాధితులకోసం ఆశ్రమం ప్రారంభించి.. కృతజ్ఞతలు తెలిపిన స్టార్ డైరెక్టర్..!
X
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. కానీ కరోనా కంట్రోల్ కాకపోవడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలలో లాక్డౌన్ అమలులో ఉంది. అయినప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా వేలసంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి వలన ఎన్ని జాగ్రత్తలు పాటించినా సోకే వారికి సోకుతూనే ఉంది.. పోయేవారు పోతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో పరిస్థితి అర్ధం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా తమవంతు సహాయం చేసేందుకు ముందడుగు వేస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇటీవలే ఆయన తమిళనాడులోని మనపక్కం ఏరియాలో కరోనా బాధితులకోసం ఆశ్రమం ప్రారంభించాడు. అయితే తాజాగా లింగుస్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించి తనకు సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా.. "కరోనా బాధితుల సహాయార్థం మనపక్కం ఏరియాలో ఆశ్రమం ప్రారంభించడానికి సహకరించిన సోదరుడు సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ - మంత్రి టిఎన్ బరాసన్ - హీరోయిన్ కీర్తిసురేష్ లకు ధన్యవాదాలు. అలాగే IPCIPACA_Official సహకారంతో @ హృదయపూర్వక_నెస్ నిర్వహించిన amkamleshdaaji యొక్క ఆశీర్వాదంతో ఇది బాగా జరిగింది." అంటూ ట్వీట్ చేసాడు.

ఇదిలా ఉండగా.. తమిళ ఇండస్ట్రీలో ఆనందమ్, రన్, జి, సందకోళి, భీమా, పైయా, వెట్టై వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ తన 20 సంవత్సరాల సినీ ప్రయాణంలో తనకు సహకరించిన నిర్మాతలు - నటులు - సాంకేతిక నిపుణులు మరియు ఇతరులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. "ఈ 20 ఏళ్లలో నాకు మద్దతు ఇచ్చిన నా సాంకేతిక నిపుణులు, కళాకారులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం మేం సెలెబ్రేట్ చేసుకునే స్థితిలో లేము. అందరి కోసం ప్రార్థిస్తున్నాము. ఈ మహమ్మారి నుండి త్వరగా కోలుకోవడం నిజమైన ఆనందం అవుతుంది. అలాగే మాకు మద్దతు తెలిపిన మీడియా వ్యక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. సురక్షితంగా ఉండండి." అంటూ లింగుస్వామి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయనను అభినందిస్తున్నారు నేటిజన్లు ఫ్యాన్స్. ప్రస్తుతం లింగుస్వామి టాలీవుడ్ హీరో రామ్ తో ఓ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.