Begin typing your search above and press return to search.

హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ కపుల్.. ఫోటోస్ వైరల్!

By:  Tupaki Desk   |   15 March 2021 12:30 PM GMT
హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ కపుల్.. ఫోటోస్ వైరల్!
X
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అవి పుకార్లని నమ్మేలోపు నిజమే అని తెల్చేసింది సునీత. సరే అనుకునేలోపు ఎంగేజ్మెంట్ జరిగిందని సడన్ షాకిచ్చింది. ఎంగేజిమెంట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సునీత మరోసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. చాలకాలం తర్వాత సునీత సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ ఏం పోస్ట్ పెట్టిందోనని ఆత్రంగా చూస్తున్నారు. అయితే ఆమె తన భర్తతో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన పిక్స్ షేర్ చేసింది. ఆమె ఇంకా తన పెళ్లి హడావిడి నుండి తేరుకున్నట్లు లేదు.

బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నట్లుగా సునీత సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉండేదో ఇప్పుడు అలా లేదు. కానీ పెళ్లి తర్వాతే ఎక్కువగా వార్తలలో నిలిచింది సునీత. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని ఇష్టపడి ఇటీవలే గుళ్లో పెళ్లి చేసుకుంది. అలాగే పెళ్లి చేసుకుంది కూడా తన పిల్లల కోసమే అంటూ చెప్పుకొచ్చింది. భర్త రామ్ చాలా మంచివారు.. ఆయనతో తన మిగిలిన జీవితం అని చెప్పింది. వీరి ఈడుజోడి కుదిరిందని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు 47.. ఆమెకు 42. ఈ మద్యే ఇద్దరూ మాల్దీవులకు హనీమూన్ కి వెళ్లారు. అక్కడి ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాగోలా మ్యారేజ్ లైఫ్ మరోసారి ఈ కపుల్ ఎంజాయ్ చేస్తుందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.