Begin typing your search above and press return to search.

ఒంట‌రి దీవుల్లో స్టార్ క‌పుల్ నైట్ లైఫ్‌ టూ కాస్ట్ లీ గురూ!

By:  Tupaki Desk   |   16 Nov 2021 7:31 AM GMT
ఒంట‌రి దీవుల్లో స్టార్ క‌పుల్ నైట్ లైఫ్‌ టూ కాస్ట్ లీ గురూ!
X
బాలీవుడ్ సెల‌బ్రిటీల ఫేవ‌రెట్ వెకేష‌న్ స్పాట్ గా మాల్దీవులు పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. ఒంట‌రి దీవిలో విహార‌యాత్ర‌లు అంతే ఖ‌రీదైన‌వి అన‌డంలో సందేహం లేదు. అంద‌మైన ఆహ్లాద‌క‌ర‌మైన‌ వాతావ‌ర‌ణంలో సాగ‌ర తీరాన ల‌గ్జరీ హోట‌ల్స్..రిసార్స్ట్ మాల్దీవుల ప్రత్యేక‌త‌. ప్ర‌పంచంలో ఎన్ని అంద‌మైన ప్ర‌దేశాలున్నా మాల్దీవులంటే సెల‌బ్రిటీల‌కు ఫేవ‌రెట్ స్పాట్ గా ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. స‌మ‌యం దొరికితే క‌పుల్స్...అందాల హీరోయిన్లు అంతా మాల్దీవుల అందాల్లో సేద‌తీరుతుంటారు. తాజాగా క‌పూర్ ఫ్యామిలీ మాల్దీవుల్లో గ‌త నెల‌లో ఎంజాయ్ చేసిన అరుదైన‌ మూవ్ మెంట్స్ ని అభిమానుల‌తో పంచుకుంది. షాహిద్ క‌పూర్- మీరా రాజ్ పుత్ జంట పిల్ల‌లు మిషా క‌పూర్...జైన్ క‌పూర్ ల‌తో క‌లిసి గ‌త నెల‌లోనే మాల్దీవుల యాత్ర‌కు వెళ్లింది.

ఈ జంట `సోనేవా ఫుషీ` అనే ల‌గ్జ‌రీ రిస్సార్స్ట్ ప్ర‌త్యేక‌ విల్లాలో బ‌స చేసారు. దానికి సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టా వేదిక‌గా నేడు అభిమానుల‌తో పంచుకున్నారు మీరా రాజ్ పుత్. `టేప్ ద‌ట్ ట్రావెల్ వోగ్` అని క్యాప్ష‌న్ తో మాల్దీవులు అందాల్ని పంచుకున్నారు. కారు మ‌బ్బులు... స‌ముద్రం ఒడ్డున ప‌చ్చ‌ని చెట్లు.. ల‌గ్జ‌రీ రిసార్స్ట్ చూస్తే మ‌తిపోవాల్సిందే. ఖ‌ర్చు కొద్దీ ఖ‌రీదైన జీవిత‌మంతా అక్క‌డే ఉంద‌ని ఓ హిట్ కూడా ఇచ్చేసింది ఈ జంట‌. ఈ ల‌గ్జ‌రీ రిసార్స్ట్ లో ఒక రాత్రి బ‌స‌కు 2.90 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుందిట‌. అన్ని ర‌కాల సౌక‌ర్యాలు..కొన్ని ర‌కాల ప్యాకేజీ ఆ రిసార్స్ట్ ప్ర‌త్యేక‌త‌. అలా సుదీర్ఘ యాత్ర కోసం ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్. అయితే స్టార్ క‌పుల్స్ సెల‌బ్రేష‌న్స్ కి మాల్దీవుల టూరిజం శాఖ రీఇంబ‌ర్స్ మెంట్ ప్యాకేజీలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనివ‌ల్ల మాల్దీవుల‌కు బోలెడంత పాపులారిటీ పెరిగింది. సారా అలీఖాన్ .. జాన్వీ క‌పూర్.. పూజా హెగ్డే ఇక్క‌డ ఇప్ప‌టికే మంట‌లు పెట్టడంలో పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇక షాహిద్ క‌పూర్ సినిమాల విష‌యానికి వ‌స్తే `జెర్సీ` రీమేక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మాతృక‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి హిందీ వెర్ష‌న్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గీతా ఆర్స్ట్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. మ‌రోవైపు కొత్త ప్రాజెక్ట్ ని షాహిద్ ప‌ట్టాలెక్కించారు. ఇందులో రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఆ సినిమా తాజా అప్ డేట్స్ వెల్లడి కావాల్సి ఉంది.