Begin typing your search above and press return to search.

సలార్‌ ప్రతినాయకుడు ది ఫ్యామిలీ మ్యాన్‌

By:  Tupaki Desk   |   20 Aug 2021 5:51 AM GMT
సలార్‌ ప్రతినాయకుడు ది ఫ్యామిలీ మ్యాన్‌
X
యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్ రాధేశ్యామ్‌ షూటింగ్‌ ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రాధే శ్యామ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రాధే శ్యామ్‌ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే సలార్ సినిమా షూటింగ్‌ లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌ లో భారీ షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాన్ అబ్రహంను విలన్‌ గా నటింపజేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తమిళ స్టార్‌ విజయ్ సేతుపతిని విలన్ గా నటింపజేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. చివరకు ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను స్టార్ నటుడు మనోజ్‌ బాజ్‌పెయిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలం సినిమాలు చేసి సౌత్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ సీనియర్ నటుడు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ రెండు సీజన్‌ లతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్‌ అంటూ అంతా కూడా ఈయన్ను కీర్తిస్తున్నారు. స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న ఈయన్ను సలార్‌ సినిమాలో విలన్ పాత్రకు గాను ప్రశాంత్‌ నీల్ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నటుడిగా మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు ఈయన అనడంలో సందేహం లేదు. అలాంటి మనోజ్‌ బాజ్‌పెయి తప్పకుండా ప్రభాస్ ను ఢీ కొట్టడంలో ది బెస్ట్‌ గా నిలుస్తాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంతో చెబుతున్నారు.

సలార్ సినిమాకు పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. మనోజ్‌ బాజ్‌పాయి ఎంట్రీతో హిందీ ఆడియన్స్ లో మరింతగా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సలార్‌ సినిమాను మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించాడు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ వారి ప్లాన్స్ ను అడ్డంగా కొట్టి పారేసింది. సలార్‌ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేక పోయిన ప్రశాంత్‌ నీల్ త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కేజీఎఫ్ 2 సినిమా సూపర్ హిట్‌ అయితే సలార్‌ సినిమా రేంజ్‌ రెట్టింపు అవ్వడం ఖాయం. విడుదలకు ముందే సలార్‌ సినిమా వందల కోట్ల బిజినెస్ చేసేంతగా క్రేజ్ ను దక్కించుకుంటుంది.

సలార్‌ తర్వాత ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాను చేస్తున్నాడు. ఈ ఏడాది చివరి వరకు ఆదిపురుష్ సినిమా ను ముగించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను ప్రభాస్ చేసేందుకు గాను ఇప్పటికే షూటింగ్‌ ను ప్రారంభించారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లు అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్‌ వచ్చే ఏడాది మరియు ఆ తర్వాత ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్‌.. సలార్‌ మరియు ఆదిపురుష్‌ లు 2022 లో అంటే వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు సినిమా లు కూడా వేల కోట్ల వసూళ్లను ప్రభాస్ కు తెచ్చి పెట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.