Begin typing your search above and press return to search.

SSMB 28: పాపలు సెట్టయ్యారు

By:  Tupaki Desk   |   16 Jan 2023 4:55 AM GMT
SSMB 28: పాపలు సెట్టయ్యారు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యుల్ కంప్లీట్ అయ్యి ఆరు నెలల దగ్గర అవుతుంది. ఫస్ట్ షెడ్యుల్ తర్వాత మహేష్ బాబు కుటుంబంలో తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ కృష్ణ చనిపోయారు. ఈ ఘటనల నేపధ్యంలో మహేష్ బాబు కాస్తా విషాదంలో ఉండటంతో సినిమా షూటింగ్ భాగా ఆలస్యం అయ్యింది. ఇదే సమయంలో పూజా హెగ్డే ప్రమాదానికి గురై కాలికి దెబ్బ తగిలించుకుంది. ఇది కూడా షూటింగ్ వాయిదా పడటానికి కారణం అయ్యింది.

ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ బయటకొచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్నట్లు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఒటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే కొనుగోలు చేసేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన అప్డేట్ ని నిర్మాతలలో ఒకరైన నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

వీరిలో ఫస్ట్ ఒకరు సెకండ్ అనే ఆప్షన్ ఏమీ లేదని, కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్స్ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వీరిద్దరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వారిద్దరి పాత్రలు సినిమాలో కీలకంగానే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అలాగే మూవీ షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుందని నాగ వంశీ తెలియజేశారు. అలాగే ఆగష్టు 11న ఈ మూవీ రిలీజ్ అవుతుందని కూడా చెప్పేశారు. దీనిని బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ షూటింగ్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడనే మాట వినిపిస్తుంది.

ఇక త్రివిక్రమ్ స్టైల్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఈ మూవీని తెరకెక్కుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ తో పాటు మరికొన్ని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. విలన్ గా సంజయ్ దత్ ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.