Begin typing your search above and press return to search.

ఇష్యూ మరింత సీరియస్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   28 Oct 2018 7:55 AM GMT
ఇష్యూ మరింత సీరియస్‌ అయ్యింది
X
బాలీవుడ్‌ లో మొదలైన మీటూ ఉద్యమం సౌత్‌కు చేరిన విషయం తెల్సిందే. సౌత్‌ స్టార్‌ హీరో అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్నాయి. మీటూ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు లైంగిక ఆరోపణలు చేసిన వారు ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. కాని శృతి హరిహరన్‌ మాత్రం మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు అర్జున్‌ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో వివాదం మరింత ముదిరింది.

సినిమా షూటింగ్‌ సమయంలో రిహార్సల్స్‌ పేరుతో దర్శకుడు చెప్పకుండానే తనను దగ్గరకు తీసుకుని, అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు సెక్యువల్‌ హెరాస్‌ మెంట్‌ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్‌ ఐ ఆర్‌ కూడా నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. మరో వైపు శృతిపై అర్జున్‌ పరువు నష్టం దావా వేశాడు. తనపై లేనిపోని లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన కారణంగా ఆమె తనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు.

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు అంబరీష్‌ సారథ్యవంలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాని వివాదం మరింత ముదురుతోంది. తనపై పరువు నష్టం దావా వేసినందుకు గాను లైంగిక వేదింపుల కేసును శృతి హరిహరన్‌ బుక్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. అర్జున్‌ పై కేసు నమోదు అవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయ్యింది.

ఒకవైపు కన్నడ సినీ పరిశ్రమ పెద్దలు రాజీకి ప్రయత్నాలు చేస్తుండగా, అర్జున్‌ కూడా రాజీకి ఓకే అంటున్నా కూడా శృతి హరిహరన్‌ మాత్రం ఏమాత్రం తగ్గేది లేదని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని అంటూనే, మరో వైపు కేసు కూడా పెట్టి సంచలనం సృష్టించింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అంటూ అర్జున్‌ అభిమానులు మరియు కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.