Begin typing your search above and press return to search.

వైర‌స్ ఇంపాక్ట్: శ్రుతి హాస‌న్ ముఖంలో భారీ మార్పులు!

By:  Tupaki Desk   |   2 March 2022 10:30 AM GMT
వైర‌స్ ఇంపాక్ట్: శ్రుతి హాస‌న్ ముఖంలో భారీ మార్పులు!
X
దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతున్నా...ఇంకా కేసులు న‌మోదవుతున్నాయి. థ‌ర్డ్ వేవ్ లో కూడా చాలా మంది సెల‌బ్రిటీలు ఓమిక్రాన్ ఓరియంట్ బారిన‌ప‌డ్డారు.

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌లువురు బిగ్ కోవిడ్ బారిన ప‌డి కోలుకున్నారు. ఇటీవ‌లే హీరోయిన్ శ్రుతి హాస‌న్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా రివీల్ చేసి జాగ్ర‌త్త‌లు సూచించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న థ‌ర్డ్ వేవ్ లో వైర‌స్ సోకింద‌ని శ్రుతి తెలిపారు.

ప్ర‌స్తుతం ఆరోగ్యం బాగానే ఉంద‌ని అన్నారు. తాజాగా శ్రుతి త‌న ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసారు. ఐసోలేష‌న్ లో త‌న క‌ష్టాల్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. ``క‌రోనాతో చాలా నీర‌సించిపోయాను. ఏం చేయాలో తెలియ‌డం లేదు` అని పోస్ట్ చేసింది. అలాగే నీర‌సించిన కొన్ని ఫోటోల్ని కూడా షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు కాస్త కంగారు ప‌డుతున్నారు. శ్రుతిహాస‌న్ బాగా నీర‌సించిన‌ట్లు ఫోటోలు చూస్తే తెలుస్తోంది.

ముఖమంతా పీక్కుపోయింది. క‌ళ్లు లోప‌లికి పోయాయి. క‌ళ్ల‌కింద న‌ల్ల‌టి చార‌లు ఏర్ప‌డ్డాయి. పెదాలు ఉబ్బిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇలా ముఖంలా చాలా మార్పులే గ‌మ‌నించ‌వ‌చ్చు. శ్రుతి పోస్ట్ ని బ‌ట్టి ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది? అని అభిమానులు కంగారు ప‌డుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. అలాగే ప‌లువురు సెల‌బ్రిటీలు..ఆమె స్నేహితులు ..స‌న్నిహితులు త్వ‌ర‌గా కోలుకుని మున‌పటిలా ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకున్నారు. వీటికి శ్రుతి హాస‌న్ రిప్లై ఇచ్చింది. మీ అంద‌రి ఆశీస్సుల‌తో త్వ‌ర‌గా కోలుకుని మీ ముందుకు వస్తాను అని బ‌ధులిచ్చారు. ఐసోలేష‌న్ లో ఉండ‌టంతో శ్రుతి ఒంట‌రిత‌నాన్ని బోర్ గా ఫీల‌వుతుంది.

ఇక శ్రుతిహాస‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే న‌టిగా ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్` లో న‌టిస్తోంది. శ్రుతిహాసన్ తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఆమె పార్ట్ చిత్రీక‌ర‌ణ కూడా పూర్తిచేసింది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో శ్రుతి మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. అలాగే మ‌రోవైపు న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో శ్రుతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరో అయిన బాల‌య్య స‌ర‌స‌న శ్రుతి క‌మిట్ మెంట్ ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసే అంశ‌మే.

ఇంకా కోలీవుడ్ లో మ‌రో రెండు ..మూడు చిత్రాల‌కు సంత‌కం చేసింది. బాలీవుడ్ లోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే హిందీలో కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే.