Begin typing your search above and press return to search.

ఆ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేసే ఛాన్స్ ప్లాప్ డైరెక్టర్ కి దక్కిందట...!

By:  Tupaki Desk   |   10 May 2020 2:30 AM GMT
ఆ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేసే ఛాన్స్ ప్లాప్ డైరెక్టర్ కి దక్కిందట...!
X
సినీ ఇండస్ట్రీలో నట వారసులు వస్తూనే ఉంటారు. టాలెంట్ తో పని లేకుండా.. యాక్టింగ్ వచ్చినా రాకున్నా.. బ్యాగ్రౌండ్ ఉంటే చాలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేయవచ్చు. ఒక్కరు ఇండస్ట్రీలో అడుగుపెడితే వారి నుండి యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. ఇది మన ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలలో తమ నట వారసులను పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి డజను మంది.. అక్కినేని ఫ్యామిలీ నుండి అర డజను మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలానే నందమూరి ఫ్యామిలీ నుండి.. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి కూడా టాలీవుడ్ కి హీరోలు పరిచయమయ్యారు. వీరే కాకుండా కొంతమంది హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా తమ పిల్లలని సినిమాల్లోకి తీసుకొచ్చారు. వారిలో చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఒకరిద్దరు మాత్రం మొదటి సినిమాకే పరిమితం అయ్యారు. వాస్తవానికి బ్యాగ్రౌండ్ అనేది మొదటి సినిమాకి మాత్రమే పనిచేస్తుంది. నటన రాకపోతే వారు సినిమాలకు దూరం అవ్వాల్సిందే. ఈ విషయం ఎంతో మంది నట వారసుల విషయంలో నిజమైంది కూడా. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య కుమారుడి ఎంట్రీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపిన డీవీవీ దానయ్యకి ఎట్టకేలకు ఒక డైరెక్టర్ దొరికాడట.

డీవీవీ దానయ్య తన కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడట. చివరికి కొడుకుని లాంచ్ చేసే ఛాన్స్ బాలయ్య బాబుని డైరెక్ట్ చేసిన శ్రీవాస్ చేతులోకి వచ్చి పడిందని సమాచారం. కాకపోతే తన కొడుకు సినిమాకి దానయ్య నిర్మాతగా వ్యవహరించడట. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' లాంటి భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్న దానయ్య తన కొడుకు సినిమా కోసం వేరే నిర్మాతకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వబోతున్నాడని సమాచారం. నిజానికి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ మారుతీ చేయాల్సి ఉంది. ఇప్పటికే 'అడ్వాన్స్' ప్రొడ్యూసర్ అంటూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న దానయ్య డైరెక్టర్ మారుతీకి కూడా అడ్వాన్స్ ఇచ్చాడట. కారణం తెలియదు కానీ సడన్ గా మారుతీ తాను తీసుకున్న అడ్వాన్స్ వడ్డీతో సహా దాన్నయ్యకి ఇచ్చేసి ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యిపోయాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ శ్రీవాస్ చేతుల్లో పడింది. 'లక్ష్యం' 'లౌక్యం' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు తీయలేదనే చెప్పాలి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీవాస్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మొత్తానికి మరో వారసుడిని ఆడియన్స్ మీద రుద్దడానికి రంగం సిద్ధం అయ్యిందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి మన ప్రొడ్యూసర్ కొడుకు తన టాలెంటుతో నెట్టుకొస్తాడా లేదా ఒక్క సినిమాకే పరిమితమవుతాడా అనేది చూడాలి.