Begin typing your search above and press return to search.

కొత్త అవతారంలో పాపులర్ కమెడియన్

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:30 PM GMT
కొత్త అవతారంలో పాపులర్ కమెడియన్
X
ఫిలిం ఇండస్ట్రీలో ఒక డిపార్ట్ మెంట్ కు చెందినవారు మరో డిపార్ట్ మెంట్ కు షిఫ్ట్ కావడం చాలా కామన్. రచయితలు దర్శకులు అవుతారు. హీరోలు నిర్మాతలుగా మారతారు. కమెడియన్లు హీరోల అవతారం ఎత్తుతారు. ఇలా ఎన్నో జరుగుతుంటాయి. కమెడియన్లు హీరోలుగా మారడం అనేది మనకు టాలీవుడ్లో చాలా సాధారణమైన విషయం. అలాగే కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా మారి 'గీతాంజలి'.. 'జయమ్ము నిశ్చయమ్మురా'.. 'ఆనందో బ్రహ్మ' చిత్రాల్లో నటించాడు విజయం సాధించాడు. కానీ లాస్ట్ సినిమా 'జంబలకిడి పంబ' మాత్రం నిరాశపరిచింది.

తాజాగా శ్రీనివాస్ రెడ్డి మరో కొత్త ట్రెండ్ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా మారి తనే హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'. ఈ సినిమా షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా పూర్తయిందట. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో కమెడియన్ ప్రవీణ్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వం గురించి వెల్లడించాడు. కొద్ది రోజుల క్రితం నెట్ లో బైటకు వచ్చిన ఒక ఆన్ లొకేషన్ పిక్ లో శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ లాగా సూచనలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ డైరెక్షన్ సంగతి తెలియలేదు కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో పలువురు టాలీవుడ్ కమెడియన్లు నటిస్తున్నారు. ఈమధ్య కమెడియన్స్ అందరూ ఒక గ్రూప్ గా గెట్ టుగెదర్ లు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఫ్లయింగ్ కలర్స్ అనే పేరుతో ఆ గ్రూప్ తరచుగా కలుస్తూ ఉంటారు. ఆ బృందంలోని సభ్యులే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. వెన్నెల కిషోర్.. ధన్ రాజ్.. ప్రవీణ్.. తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి కమెడియన్ గా మెప్పించిన శ్రీనివాసరెడ్డి హీరోగానూ మెప్పించాడు. ఈసారి కొత్త ట్రెండ్ సృష్టిస్తూ దర్శకత్వం చేపట్టాడు.. ఇందులో కూడా విజయం సాధిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.