Begin typing your search above and press return to search.

ఇద్దరిని ఆయన చేతిలోనే పెట్టారు

By:  Tupaki Desk   |   4 May 2018 6:35 AM GMT
ఇద్దరిని ఆయన చేతిలోనే పెట్టారు
X
మెగా ఫ్యామిలిలో యువ హీరోల జోరు రోజు రోజుకి పెరుగుతోంది. ఒకరిని మించి మరొకరు మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ యువ హీరోల లిస్ట్ లో మరొక హీరో కూడా జాయిన్ కానున్నాడు. చీరంజీవి చిన్న చెల్లి కుమారుడు సాయి ధరమ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఎక్కువగా ఉండే ఈ మెగా మేనల్లుడు ఇక తన కెరీర్ ను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు.

అయితే అందుకోసం దర్శకుడు కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. మొదటి రెండు సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనివాస్ అవసరాల నెక్స్ట్ మెగా హీరోల ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. వైష్ణవ్ తేజ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ ను కూడా శ్రీనివాస్ డైరెక్షన్ లోనే పరిచయం చేయించాలని మెగా లీడర్ డిసైడ్ అయ్యారు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఒక కథను విని వైష్ణవ్ తేజ్ కు సెట్ అయ్యేలా చేశాడు.

దాదాపు ఈ ఇద్దరు హీరోలను శ్రీనివాస్ అవసరాల ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముందు కళ్యాణ్ సినిమా వచ్చే ఛాన్స్ ఉందట. ఇక ఈ రెండు ప్రాజెక్టు లను వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఇద్దరు మెగా హీరోల భవిష్యత్తును మెగాస్టార్ ఈ ఇద్దరికి అప్పజెప్పారు అంటే వారిపై ఎంత నమ్మకం ఉంచారో తెలుస్తోంది. మరి వారు అనుకున్నంత రేంజ్ లో బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇస్తారో లేదో చూడాలి.