Begin typing your search above and press return to search.

ఫోటోగ్రాఫర్లపైకి బాడీగార్డుల్ని ఉసిగొల్పింది

By:  Tupaki Desk   |   1 Jun 2016 1:30 PM GMT
ఫోటోగ్రాఫర్లపైకి బాడీగార్డుల్ని ఉసిగొల్పింది
X
ఈ రోజుల్లో సెలబ్రెటీలు బాడీ గార్డులు.. బౌన్సర్లు లేకుండా బయటికి రావట్లేదు. మీడియా వాళ్లు.. అభిమానులు ఏమాత్రం అతి చేసినా వారి కండ బలం రుచి చూడాల్సిందే. ఐతే సెలబ్రెటీలే కాక ఏ ఇమేజ్ లేని వారి పిల్లలు కూడా మీడియా మీద దాడికి దిగుతుండటమే చిత్రం. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ఇలాగే చేసింది. ఇంకా సినిమాల్లోకి రాకముందే అమ్మడు బాడీ గార్డుల్ని మెయింటైన్ చేస్తోంది. ఇటీవలే ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అక్కడ ఆమె మీడియా వాళ్ల కంట పడింది. ఇలాంటపుడు ఫొటోలు తీయడం కరెక్టూ కాదు. ఐతే త్వరలోనే సినిమాల్లోకి రావాలనుకుంటున్న జాన్వి లాంటి వాళ్లు దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన పని కూడా లేదు.

కానీ జాన్వి మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బాడీగార్డుల్ని ఫొటోగ్రాఫర్ల మీదికి ఉసిగొల్పింది. ఆమె కారులో ఎక్కే వరకు వాళ్లు ఫొటోగ్రాఫర్లను అడ్డుకున్నారు. ఒకరిద్దరిపై పిడిగుద్దులు కూడా కురిపించారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఇప్పటికే హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. పార్టీలకూ పబ్బులకూ తిరుగుతూ.. రెచ్చగొట్టే ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసే జాన్వి.. ఎయిర్ పోర్టులో క్యాజువల్ గా వెళ్తున్నపుడు ఫొటోలు తీస్తే ఇంత రాద్దాంతం చేయడం.. తమపైకి బాడీగార్డుల్ని ఉసిగొల్పడం కరెక్టా అని ఫొటోగ్రాఫర్లు గొడవ చేస్తున్నారు. దీనిపై బోనీ కపూర్.. శ్రీదేవిలతో కూడా మాట్లాడారట. ఇలా చేస్తే మున్ముందు జాన్విని సినిమాల్లోకి తీసుకొచ్చి ప్రమోట్ చేయాలనుకున్నపుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా వాళ్లు హెచ్చరించారట. ఆ వార్నింగులకు శ్రీదేవి-బోనీ ఎలా స్పందించారో మరి.