Begin typing your search above and press return to search.

పవన్ అభిమానులతో శ్రీరెడ్డి డిష్యుం డిష్యుం

By:  Tupaki Desk   |   24 Dec 2018 2:08 PM GMT
పవన్ అభిమానులతో శ్రీరెడ్డి డిష్యుం డిష్యుం
X
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలతో కొన్ని నెలల పాటు హల్ చల్ చేసింది శ్రీరెడ్డి. ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టిన ఘటనతో కథ అడ్డం తిరిగింది. శ్రీరెడ్డి మాటకు విలువ లేకుండా పోయింది. ఆ దెబ్బతో కొంత కాలం మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన కొందరు సెలబ్రెటీల మీదా సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. టాలీవుడ్ సంగతి పట్టించుకోవడం మానేసింది. కానీ అప్పుడప్పుడూ ఆమె పవన్ కళ్యాణ్ ను మాత్రం టార్గెట్ చేస్తూనే ఉంది. పవన్ ఏ పని చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి.. ఆయన రాజకీయ విషయాల పైనా దృష్టిసారించింది. తాజాగా జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించిన సంగతి తెలిసిందే.

ఓ వైపు పవన్ అభిమానులు ఈ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా.. మరో వైపు శ్రీరెడ్డి ఆ గుర్తు పై సెటైర్లు గుప్పిస్తోంది. పవన్ పార్టీకి కేటాయించింది బీరు గ్లాసా.. వైన్ గ్లాసా.. స్కాచ్ గ్లాసా అంటూ ఆమె సెటైర్ వేసింది. అంతటితో ఆగకుండా పవన్ అన్నయ్య నాగబాబుకు కూడా ఒక గ్లాస్ ఇవ్వండర్రా అంటూ ఆమె సంచలన వ్యాఖ్య చేసింది. ఈ మధ్య నాగబాబుకు కొత్తగా గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ బాలయ్య ఎవరో తెలియదంటూ ఆయన చేసిన కామెంట్ మీద సెటైర్ వేసింది శ్రీరెడ్డి. ముందు నుంచే శ్రీరెడ్డి మీద మండిపోతున్న పవన్ అభిమానులకు తాజా వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా శ్రీరెడ్డి ఏమీ తగ్గకుండా వారితో ఫైటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలోనే ఉంటూ అక్కడ ఓ తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం. మకాం మార్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ను మాత్రం ఆమె వదలట్లేదు.