Begin typing your search above and press return to search.

బిగ్ బాస్: మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు..

By:  Tupaki Desk   |   14 Aug 2019 4:29 AM GMT
బిగ్ బాస్: మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు..
X
బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా సాధ్యమని అర్ధమవుతుంది. ఎంతో కలిసిమెలిసి ఉండేవారు సైతం హౌస్ లోకి వెళ్ళగానే శత్రువులుగా మారిపోతున్నారు. అలాగే శత్రువులుగా ఉన్న వారు మిత్రులు అయిపోతున్నారు. బిగ్ బాస్ తలుచుకుంటే హౌస్ మేట్స్ మధ్య గొడవలు బాగానే పెడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇప్పుడు బిగ్ బాస్ షో లో జరుగుతుంది. ఇప్పటికే హౌస్ లో గ్రూపులు ఉన్నాయన్న సంగతి అర్ధమవుతుంది. ఈ గ్రూపులు సంగతి పక్కన ఉంచితే. మొన్నటివరకు హౌస్ బయట మిత్రులుగా ఉన్న శ్రీముఖి-రాహుల్ హౌస్ లోకి వచ్చాక శత్రువులుగా మారిపోయారు.

మొదట్లో హౌస్‌ లోకి వచ్చినప్పుడు బాగానే మెలిగిన ఈ ఇద్దరు...రాను రాను గొడవలు పడటం మొదలుపెట్టారు. పైగా వీరిద్దరు అపోజిట్ గ్రూపుల్లో ఉన్నారు. దీంతో వీరు ఏదొక విషయంలో గొడవపడుతూనే ఉన్నారు. మొన్న ఓ టాస్క్ లో భాగంగా శ్రీముఖి నగదు ఉన్న అద్దాల బాక్సుని డంబెల్ తో బ్రేక్ చేసింది. అలాగే తన టీంలో ఉన్న రవిని కూడా బ్రేక్ చేయమని చెప్పింది. అప్పుడు రవి ఆవేశంగా చేతితో బ్రేక్ చేసి గాయం అయ్యేలా చేసుకున్నాడు.

దీనికి కారణం శ్రీముఖినే అంటూ రాహుల్ చెడామడా తిట్టేశాడు. ఫాల్తుది - అన్నీ ఫాల్తు పనులు చేసిందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అయితే శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున రాహుల్ మాట్లాడిన‌ మాటలు తప్పు అని ఖండించి రాహుల్ చేత క్షమాపణ చెప్పించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా శ్రీముఖి తన టీంలోకి రాహుల్ ని తీసుకుంది.

ఈ క్రమంలోనే టాస్క్ లో సపోర్ట్ చేస్తానని చెప్పి చివరికి తనని మోసం చేశాడని శ్రీముఖి మిగిలిన హౌస్ సభ్యులకి చెప్పుకుంది. కానీ రాహుల్ కూడా తనని మోసం చేద్దామని అనుకుంది.... అందుకే నేనే రివర్స్ అయ్యాను అని వితిక - పునర్నవిలకి చెప్పాడు. మరి శత్రువులుగా మారిన ఈ మిత్రులు మధ్య రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.