Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 3 : అప్పుడే రచ్చ మొదలు

By:  Tupaki Desk   |   8 Jan 2019 1:30 AM GMT
బిగ్‌ బాస్‌ 3 : అప్పుడే రచ్చ మొదలు
X
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్‌ బాస్‌ బాగానే కనెక్ట్‌ అయ్యింది. మొదటి సీజన్‌ కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయడం వల్ల భారీగా టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. ఇక రెండవ సీజన్‌ కు నాని హోస్టింగ్‌ చేయడంతో పాటు - కౌశల్‌ ఆర్మీ కారణంగా పెద్ద ఎత్తున ఆధరణ దక్కింది. మొదటి సీజన్‌ తో పోల్చితే రెండవ సీజన్‌ కు వివాదాలు ఎక్కవ చుట్టు ముట్టాయి. దాంతో మూడవ సీజన్‌ ఉంటుందా లేదా అంటూ కొందరిలో చర్చ జరుగుతుంది. ఇంకా బిగ్‌ బాస్‌ నిర్వాహకుల నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాని సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో మాత్రం రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.

మొన్నటి వరకు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3కి హోస్ట్‌ గా వెంకటేష్‌, చిరంజీవితో పాటు ఇంకా పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 పార్టిసిపెంట్స్‌ గురించిన వార్తలు వస్తున్నాయి. బిగ్‌ బాస్‌ 3 కోసం నిర్వాహకులు రేణు దేశాయ్‌ తో పాటు ఇంకా పలువురు సినీ సెలబ్రెటీలతో పాటు - సోషల్‌ మీడియా స్టార్స్‌ ను సంప్రదిస్తున్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు రాసేస్తున్నారు.

బిగ్‌ బాస్‌ 3 లో వీరే పార్టిసిపెంట్స్‌ అంటూ కొందరు ఈ పేర్లను తెగ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఆ పేర్లేంటంటే.. రేణు దేశాయ్‌ - ఉదయ భాను - శోభిత ధూళిపాల - గద్దె సింధూర - మహాతల్లి ఫేం జాహ్నవి - వరుణ్‌ సందేశ్‌ - కమల్‌ కామరాజు - బుల్లి తెర నటుడు జాకీ - సింగర్‌ హేమచంద్ర - కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ - జబర్దస్త్‌ కమెడియన్‌ పొట్టి నరేష్‌. ఈ పేర్లలో ఏది నిజమో ఏది అబద్దమో పక్కన పెడితే రేణు దేశాయ్‌ పేరు రావడం చాలా విచిత్రంగా ఉంది. ఆమె బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో పాల్గొనడం అనేది నూటికి నూరు శాతం సాధ్యం అయ్యే పని కాదు. ఇంకా ఈ జాబితాలో పలువురు కూడా బిగ్‌ బాస్‌ 3 లో చోటు సంపాదించుకోవడం అసాధ్యం. ఒక వేళ సీజన్‌ 3 ఉంటే మాత్రం చాలా సమయమే ఉంది. ఇప్పటి నుండే ఈ రచ్చ చర్చలు ఎందుకో వారికే తెలియాలి.