Begin typing your search above and press return to search.

మోహ‌న్‌ బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా' హైద‌రాబాద్ షెడ్యూల్ ప్రారంభం..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 9:51 AM GMT
మోహ‌న్‌ బాబు స‌న్ ఆఫ్ ఇండియా హైద‌రాబాద్ షెడ్యూల్ ప్రారంభం..!
X
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటిస్తున్న దేశభక్తి చిత్రం ''సన్ ఆఫ్ ఇండియా''. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై మోహ‌న్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్ర బృందం ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ తిరుప‌తిలో పూర్తి చేసింది. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారని తెలుస్తోంది. ఈరోజు బుధ‌వారం హైద‌రాబాద్‌ లో తాజా షెడ్యూల్‌ షురూ చేశారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై అధిక భాగం స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌ లో చిత్రీక‌రిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా, 'సన్ ఆఫ్ ఇండియా' లో ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని అత్యంత ప‌వ‌ర్‌ ఫుల్ రోల్‌ లో డాక్ట‌ర్‌ మోహ‌న్‌ బాబు కనిపించనున్నారు. ఈ త‌ర‌హా క‌థ కానీ.. ఈ జాన‌ర్ సినిమా కానీ ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌ లో రాలేదని మేకర్స్ పేర్కొంటున్నారు. మోహ‌న్‌ బాబుకు స్టైలిస్ట్‌ గా ఆయ‌న కోడ‌లు విరానికా మంచు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం. మోహ‌న్‌ బాబును ఆమె పూర్తిగా స‌రికొత్త రూపంలో చూపిస్తున్నారని తెలుస్తోంది. మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు అందిస్తోన్న ఈ చిత్రానికి స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. మోహ‌న్‌ బాబు స్వ‌యంగా స్క్రీన్‌ప్లే స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ ర‌త్న‌బాబు మరియు తోట‌ప‌ల్లి సాయినాథ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాట‌లు రాస్తుండ‌గా.. గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌ గా చిన్నా ప‌నిచేస్తున్నారు. గతంలో ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మంచు మోహన్ బాబు మరోసారి ఈ చిత్రంతో దేశభక్తిని చాటిచెప్పబోతున్నారు.