Begin typing your search above and press return to search.

OTT ‌లో పే-పర్-వ్యూ .. ఏంటి బ్ర‌ద‌ర్ ఈ క‌ష్టం?

By:  Tupaki Desk   |   4 Oct 2020 3:30 AM GMT
OTT ‌లో పే-పర్-వ్యూ .. ఏంటి బ్ర‌ద‌ర్ ఈ క‌ష్టం?
X
నేచుర‌ల్ స్టార్ నాని - సుధీర్ బాబు హీరోలుగా న‌టించిన `వి` ... అనుష్క న‌టించిన `నిశ్శ‌బ్ధం` ఓటీటీలో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల‌కు మిశ్ర‌మ స్పంద‌న‌ల న‌డుమ స‌రైన ఆద‌ర‌ణ ద‌క్క‌లేద‌న్న చ‌ర్చా సాగింది. అంత‌కుముందు కీర్తి సురేష్ `పెంగ్విన్` ప‌రిస్థితి అంత‌కు మిన‌హాయింపేమీ కాదు.

సాయి తేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` ఇప్పుడు ఇదే బాట‌లో ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోంద‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. ఇప్ప‌టికే నిర్మాత‌లు బ్యాలెన్స్ షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఇన్నాళ్లు.. థియేట్రికల్ విడుదల అనుకున్నా.. ఇటీవ‌ల ఆలోచ‌న మారింద‌ని..‌ ప్రత్యక్ష OTT రిలీజ్ కి వెళ్ళే అవకాశం ఉందని క‌థ‌నాలొ‌స్తున్నాయి.

చిత్ర నిర్మాతలు ప్ర‌స్తుతం ప్రముఖ స్ట్రీమింగ్ ఛానల్ జీ ప్లెక్స్ తో చర్చలు జరుపుతున్నారు. ఇరు పార్టీల మధ్య ఒప్పందం లాక్ అయ్యే స‌న్నివేశం ఉంద‌ని స‌మాచారం. OTT ‌లో పే-పర్-వ్యూ ప్రాతిపదికన ప్రదర్శించేందుకు మంత‌నాలు సాగుతున్నాయ‌ట‌. ఈ చిత్రానికి డెబ్యూ సుబ్బూ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్ కథానాయికగా నటించింది. అత్తారింటికి దారేది ఫేం బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.