Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో సింగిల్ పేరంట్ ట్రెండ్!

By:  Tupaki Desk   |   9 March 2020 10:20 AM GMT
సినీ ఇండస్ట్రీలో సింగిల్ పేరంట్ ట్రెండ్!
X
సెలబ్రెటీలు పెళ్లి కాకుండా పిల్లల్ని కంటున్నారు. అయితే ఇదేదో తప్పుడు మార్గంలో అనుకుంటే పొరపడినట్లే.. వాళ్లంతా పిల్లలు కోసం సరోగసీ విధానాన్ని అనుసరిస్తున్నారు. అద్దె గర్భం(సరోగసి) ద్వారా పిల్లల్ని కనడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ చెందిన సెలబెట్రీలు సరోగసీ ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

*తమ్ముడిని ఫాలో అయిన అక్క..
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ పెళ్లి కాకుండానే సరోగసీ విధానంలో బిడ్డకు జన్మనివ్వడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. పెళ్లికాకుండా మాతృత్వాన్ని పొందడంపై తాజాగా ఏక్తా కపూర్ వివరించారు. తాను సరోగసీ విధానంలో బిడ్డను కనడానికి తన సోదరుడు తుషార్ కపూర్ ఆదర్మమంటుంది. నన్ను కానీ, నా తల్లిదండ్రులను కానీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం షాక్ గురిచేసింది. అలా పెళ్లి కాకుండా పిల్లలకు తండ్రి (సింగిల్ పేరెంట్‌)గా ఉండాలనుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది. తాను అద్దె గర్భం ద్వారా తండ్రి కావడం మరెందరికో స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పింది.

*పెళ్లి విషయంలో స్పష్టత లేనందునే..
ఒకరి కోసం నేను పెళ్లి చేసుకోవడం తనకు నచ్చదని ఏక్తాకపూర్ చెప్పారు. పెళ్లి విషయంలో తనకు స్పష్టమైన వైఖరి లేదని చెప్పింది. 36 ఏళ్లు ఉన్నప్పుడే తన అండాలను భద్రపరుచుకొన్నానని చెప్పింది. సింగిల్ పేరెంట్‌గా కావాలని చాలారోజుల ఎదురు చూస్తున్నట్లు అమ్మడు చెప్పింది. తుషార్ కుమారుడు లక్ష్యను, తన కుమారుడు రావీ కపూర్‌ను తమ తల్లిదండ్రులు చక్కగా చూసుకొంటున్నారని చెప్పింది. పిల్లలతోనే వారు ఎక్కువ సమయాన్ని వారితోనే గడుపుతున్నారని చెప్పింది. తనకు తన సంతోషమే ముఖ్యమని వేరేవాళ్లు ఏమనుకున్న పట్టించుకోనని చెప్పింది.

ఏక్తాకపూర్ టెలివిజన్, సీనీ రంగాల్లో సత్తా చాటింది. ఏక్తాకపూర్ తమ్ముడిని ఆదర్శకంగా తీసుకొని పిల్లల్ని కంటే.. ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రెటీలు ఈ అమ్మడిని ఆదర్శంగా తీసుకొని సింగిల్ పేరంట్ కావాలని ఆశపడుతున్నారు. ఇది ఒక బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ కుడా పాకింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా సరోగసీ విధానం ద్వారానే పిల్లల్ని కన్నారు.
సెలబ్రెటీలంతా సింగిల్ పేరెంట్స్ విధానంలో పిల్లల్ని కంటే పెళ్లి వ్యవస్థ విచ్చిన్నం అవడం ఖాయంగా కన్పిస్తుంది. పిల్లలు లేనివారికి సంతానం కోసం కనిపెట్టిన సరోగసీ విధానం ఇలా సింగిల్ పేరెంట్స్ విధానానికి దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సింగిల్ పేరెంట్స్ విధానం ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.