Begin typing your search above and press return to search.

ఓటీటీకి అమ్ముడు పోతున్న నిర్మాతలు!

By:  Tupaki Desk   |   10 May 2020 6:00 AM GMT
ఓటీటీకి అమ్ముడు పోతున్న నిర్మాతలు!
X
సినిమాలు రిలీజ్ చేసేందుకు థియేట‌ర్లు దొర‌క్క చిన్న‌ నిర్మాత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసే ప‌రిస్థితి ఉండేది. ఒకేసారి మూడు నాలుగు సినిమాల్ని ఒకేసారి రిలీజ్ చేయాలంటే ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఉండేది. బాలీవుడ్ లో అలా లేక‌పోయినా టాలీవుడ్ లో ఎప్పుడూ ఈ స‌న్నివేశం ఉంది. క‌రోనా లాక్ డౌన్ రాక మునుపు ఇదే ప‌రిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివ‌ర్సులో ఉంది. అస‌లు థియేట‌ర్ల‌తో మాకేంటి ప‌ని స‌జావుగా ఓటీటీ వేదిక ఉండ‌గా అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

ఇటు అగ్ర నిర్మాత దిల్ రాజు అయినా అటు త‌మిళ హీరో కం నిర్మాత సూర్య అయినా అదే బాట‌ను అనుస‌రించారు. వీళ్ల‌ను చూసి ఎంద‌రో అలానే చేస్తున్నారు. మునుముందు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. వీటిలో మీడియం బ‌డ్జెట్ సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

అదంతా అటుంచితే టాలీవుడ్ నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు అంద‌రి కంటే కాస్త ముందుగానే క‌రోనా విష‌యంలో మేల్కొన్నారు. అంద‌రినీ నిద్ర లేపారు. ఇప్పుడు అదే బాట‌లో అటు బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ సైతం ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సినిమాల్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ న‌టించిన కార్గిల్ గ‌ర్ల్ - గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్ ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ చేసేందుకు విక్ర‌యించేశారు. అలాగే ఇదే బ్యాన‌ర్ లో తెర‌కెక్కిన మ‌రో సినిమా షేర్షా ని కూడా ఓటీటీకి అమ్మేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- కియ‌రా అద్వాణీ జంట‌గా న‌టించిన షేర్షా చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే దీనిని క‌రణ్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప‌లువురు భాగ‌స్వాముల‌తో క‌లిసి డ్రైవ్ వెబ్ సిరీస్ ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదేమీ పెద్దంత స‌క్సెస్ కాలేదు. క‌నీసం కార్గిల్ గ‌ర్ల్- షేర్షా ఆ లోటును భ‌ర్తీ చేస్తాయేమో చూడాలి. ల‌స్ట్ స్టోరీస్ తో ఓటీటీలో కియ‌రా పాపురైంది కాబ‌ట్టి అది షేర్షాకి క‌లిసొస్తుందేమో!