Begin typing your search above and press return to search.

కొత్త జీవితంలోకి కొత్త బంగారు లోకం బ్యూటీ

By:  Tupaki Desk   |   28 Nov 2018 4:41 PM GMT
కొత్త జీవితంలోకి కొత్త బంగారు లోకం బ్యూటీ
X
తెలుగు ప్రేక్షకులకు ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో పరిచయం అయ్యిన శేత బసు ప్రసాద్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే అదృష్టం బాగా లేకనో మరేంటో కాని శ్వేత బసు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన శేత బసు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ విషయమై స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చేసింది. గత కొన్ని రోజులుగా రోహిత్‌ అనే వ్యక్తితో శ్వేత ప్రేమలో ఉందట. వీరిద్దరు డిసెంబర్‌ 13న పూణెలో వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

తాజాగా శ్వేత బసు ప్రసాద్‌ తన స్నేహితులకు బ్యాచిలర్స్‌ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో రోహిత్‌ కూడా పాల్గొన్నాడు. పార్టీలో ఎంజాయ్‌ చేసిన పిక్స్‌ ను శ్వేత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. బ్యాచిలర్‌ లైఫ్‌ కు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా శ్వేత ప్రకటించింది. శ్వేత బసు, రోహిత్‌ ల మద్య పరిచయం కారణం అనురాగ్‌ కశ్యప్‌. బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ అయిన అనురాగ్‌ కశ్యప్‌ ఒక ప్రాజెక్ట్‌ కోసం వీరిద్దరిని తీసుకున్నాడు. ఆ సమయంలోనే వీరి పరిచయం అయ్యిందట.

తన ప్రేమను మొదట శ్వేత బస్సు ప్రసాద్‌ రోహిత్‌ కు గోవాలో చెప్పిందట. కాస్త గ్యాప్‌ తీసుకున్న రోహిత్‌ ఆమెకు పూణెలో ఓకే చెప్పాడట. వీరిద్దరి పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం పుణెలో నిర్వహించేందుకు ఇద్దరి కుటుంబ సభ్యులు సర్వం సిద్దం చేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న శ్వేతకు అంత మంచి జరగాలని కోరుకుందాం.