Begin typing your search above and press return to search.

కొత్త బుల్లితెర లోకంలో శ్వేతా బసు

By:  Tupaki Desk   |   9 Oct 2016 9:30 AM GMT
కొత్త బుల్లితెర లోకంలో శ్వేతా బసు
X
శ్వేతా బసు చాలా స్పీడ్ గా ట్యాలెంటెడ్ హీరోయిన్ అనిపించేసుకుని.. అంతకంటే స్పీడ్ గా వివాదాల్లో ఇరుకున్ని సినిమాలకు దూరమైపోయిది. బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ కూడా తీసుకున్న ఈ భామ.. ప్రస్తుతం ముంబైలో మకాం వేసింది. కొన్నేళ్లుగా వివాదం కారణంగా యాక్టింగ్ కి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరోసారి ముఖానికి రంగు వేసుకుంది.

అయితే.. ఈసారి వెండితెరపై కాకుండా బుల్లి తెరపై ట్యాలెంట్ చూపించనుంది కొత్త బంగారు లోకం భామ. అక్టోబర్ 10 నుంచి స్టార్ ప్లస్ లో కొత్త సీరియల్ ప్రసారం కానుంది. చారిత్రక కథగా చంద్రగుప్తుడి కథతో బుల్లితెరకెక్కుతున్న ఈ సీరియల్ లో.. శ్వేతా బసుకు కీలక పాత్ర దక్కడం విశేషం. చంద్రగుప్త మౌర్యుడి భార్య చంద్ర నందినిగా అలరించనుందని తెలుస్తోంది. 'యాక్టర్లందరికీ ఇది చాలా ఎగ్జైటింగ్ టైమ్. బుల్లితెరపై అనేక రకాల పాత్రలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ రంగంలో కూడా అడుగు పెడుతున్నా. టెలివిజన్ షోస్ కొంత క్రిస్పీగా ఉంటాయి. స్టోరీలు కూడా డిఫరెంట్ గా సాగుతాయి' అంటోంది శ్వేతాబసు.

వారియర్ క్వీన్ రోల్ కావడంతో.. చంద్ర నందిని రోల్ కోసం బాగానే కష్టపడిందట శ్వేతా బసు. కత్తి యుద్ధాలు.. గుర్రపు స్వారీ కూడా నేర్చకోవాల్సి వచ్చిందట. అంతే కాదు.. మగధ.. మౌర్య చరిత్రలను కూడా తెగ చదివేసి మరీ ఈ పాత్రకు సిద్ధమయిందట శ్వేతాబసు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/