Begin typing your search above and press return to search.

అమ్మడి గ్లామరస్ గ్రీటింగ్ షో అదిరిందిగా..!!

By:  Tupaki Desk   |   25 Dec 2020 12:30 PM GMT
అమ్మడి గ్లామరస్ గ్రీటింగ్ షో అదిరిందిగా..!!
X
బీహార్ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2008లో విడుదలైన 'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావడంతో అమ్మడికి ఆఫర్స్ బాగానే వచ్చాయి. కానీ రెండు మూడు మాములు హిట్స్ తప్ప శ్వేతాకి తెలుగులో పెద్దగా హిట్స్ దక్కలేదు. కాస్కో, రైడ్ సినిమాల తర్వాత పలు సినిమాలలో నటించినా ఫలితం లేకపోవడంతో ఈ భామ ఐటమ్ సాంగ్స్ వైపు మళ్ళింది. జీనియస్ సినిమాలో 'డిబిరి డిబిరి' పాటలో ఐటమ్ గర్ల్ గా చిందేసింది. అలా అయినా ఆఫర్స్ వస్తాయేమో అనుకుంది కానీ అవి కూడా రాలేదు. చివరికి కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా శ్వేతా పోలీస్ కేసుల వరకు వెళ్ళింది.

ఇదిలా ఉండగా శ్వేతా.. నిజానికి బాలనటిగా బాలీవుడ్ సినిమాలతోనే వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అంతేగాక బాలనటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. కానీ హీరోయిన్ గా మారాక అదృష్టం తలుపు తట్టలేదు. శ్వేతా హిందీ, తెలుగు మాత్రమే కాదు తమిళ, బెంగాలీ బాషలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య మళ్ళీ కెరీర్ వైపు దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. అందుకే సినిమాలు లేకపోయినా ఫోటో షూట్లతో తన ఫ్యాన్స్, నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తోంది. ఇక మాస్ మీడియా జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్వేతా.. 2018లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ను వివాహమాడింది. కానీ పెళ్ళైన ఏడాదికే అంటే 2019లో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సోలోగా ఉంటున్న ఈ భామ.. మళ్ళీ మంచి సినిమా అవకాశం కోసం చూస్తోందట. ఇక తాజాగా శ్వేతా ఇంస్టాలో పోస్ట్ చేసిన క్రిస్మస్ సెలెబ్రేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తూ అమ్మడు ఇంకా గ్లామర్ షోకి రెడీగానే ఉన్నట్లుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.