Begin typing your search above and press return to search.

బాలయ్య ను విస్మరించిన శృతిహాసన్..!

By:  Tupaki Desk   |   10 Nov 2021 12:30 PM GMT
బాలయ్య ను విస్మరించిన శృతిహాసన్..!
X
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా సిద్ధం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనుంది. ఇక బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్న ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.

#NBK107 చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత శృతి హాసన్ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ షూటింగ్‌ లో చేరడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ ట్వీట్ లో ఎక్కడా హీరో బాలకృష్ణ పేరును గానీ.. నిర్మాతలను గానీ శృతి ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

''వెయిట్ చేయలేకపోతున్నా గోపీచంద్. పనిని చాలా సరదాగా చేసినందుకు మరియు ఈ ప్రక్రియలో గొప్ప స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్లీ మీతో మొత్తం టీమ్‌ తో కలిసి పని చేయడానికి చాలా సంతోషిస్తున్నాను" అని శ్రుతి హాసన్ ట్వీట్ చేశారు. శృతి తన స్నేహితుడు గోపీచంద్ మలినేని కోసమే ఈ ప్రాజెక్ట్‌ లోకి వస్తున్నట్లు ఈ ట్వీట్ స్పష్టంగా సూచిస్తుంది.

నిజానికి బాలకృష్ణ కు జోడీగా నటించడానికి స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నిరాకరించిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే గోపీచంద్ మలినేని ఆమెను ఒప్పించి ఈ సినిమాకి సైన్ చేయించారట. గతంలో గోపీచంద్ దర్శకత్వం వహించిన 'బలుపు' 'క్రాక్' వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వీరి మధ్య ఉన్న స్నేహంతోనే ఇప్పుడు మూడోసారి NBK107 లో శృతి భాగం అయ్యారని టాక్ నడుస్తోంది.

ఏదేమైనా 'సలార్' వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్న శృతి హాసన్.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతుండటం సినిమాకు మరింత హైప్ తెచ్చిపెడుతుందనడంలో సందేహంలేదు. మరి బాలయ్య - శృతి హాసన్ జోడీ స్క్రీన్ మీద ఏ విధంగా సందడి చేస్తారో చూడాలి.