Begin typing your search above and press return to search.

చిరు 154 కోసం శృతికి షాకింగ్ అమౌంట్‌?

By:  Tupaki Desk   |   10 March 2022 1:17 PM GMT
చిరు 154 కోసం శృతికి షాకింగ్ అమౌంట్‌?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `కాట‌మ‌రాయుడు` త‌రువాత శృతిహాస‌న్ తెలుగులో క‌నిపించ‌లేదు. దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `క్రాక్‌`తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. `క్రాక్‌` తో టెర్రిఫిక్ హిట్ ని సొంతం చేసుకున్న శృతిహాస‌న్ వెంట‌నే ప్ర‌భాస్ చిత్రంలో న‌టించే గోల్డెన్ ఆఫ‌ర్ ని సొంతం చేసుకుంది.

ప్ర‌భాస్ `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో `స‌లార్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు జోడీగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర లో శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని ప‌ట్టేసింది.

`అఖండ‌` బ్లాక్ బ‌స్ట‌ర్ తో మాంచి రైజింగ్ లో వున్న నంద‌మూరి బాల‌కృష్ణ అదే జోష్ తో మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని వేటపాలెం పరిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీలోని బాల‌య్య లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే బ్యాక్ లు బ్యాక్ క్రేజీ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ షాకిస్తున్న శృతిహాస‌న్ ఏకంగా మెగాస్టార్ మూవీని ప‌ట్టేసింది.

మెగాస్టార్ చిరంజీవితో ద‌ర్శ‌కుడు బాబీ ఓ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ చిరు 154వ చిత్రం. `వాల్తేరు వీరయ్య‌` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో మెగాస్టార్ కు జోడీగా శృతి న‌టించ‌నుంది.

ఈ విష‌యాన్ని ఇటీవ‌ల మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇదిలా వుంటే ఈ క్రేజీ చిత్రానికి శృతిహాస‌న్ ఎంత ఛార్జ్ చేస్తోంద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల చిత్రాల్లో న‌టిస్తున్న శృతిహాస‌న్ తాజాగా మెగాస్టార్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణం ఏంటీ? .. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత తీసుకుంటోంది అన్న‌ది ఇప్ప‌డు ఫిల్మ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బాల‌కృష్ణ చిత్రానికి కోటిన్న‌ర మాత్ర‌మే ఛార్జ్ చేసిన శృతిహాస‌న్ మెగాస్టార్ మూవీకి మాత్రం 2 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే చిరు చిత్రానికి 2 కోట్లు ఇస్తేనే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాన‌ని శృతిహాస‌న్ ఖ‌రాకండీగా చెప్పంద‌ని, దీంతో మేక‌ర్స్ త‌ను డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వ‌డానికి రెడీ అయిపోయాకే అధికారికంగా ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.