Begin typing your search above and press return to search.

పెళ్లికి నో.. డేటింగ్ వరకే అనడం వల్లే బ్రేకప్‌..?

By:  Tupaki Desk   |   30 July 2022 3:30 AM GMT
పెళ్లికి నో.. డేటింగ్ వరకే అనడం వల్లే బ్రేకప్‌..?
X
బాలీవుడ్‌ యంగ్ స్టార్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ మరియు దిశా పటానీ అయిదేళ్ల ప్రేమ బందం కు గుడ్‌ బై చెప్పేసినట్లే అన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరిద్దరి బంధం గురించి గత నాలుగు అయిదు సంవత్సరాల గురించి మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఇద్దరిలో ఎవరు కూడా అధికారికంగా బయటకు చెప్పకున్నా కూడా ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ కోడై కూసింది.

వీరిద్దరు జోడీగా సినిమాలు కూడా వచ్చాయి. పలు ఈవెంట్స్ లో పాల్గొనడంతో పాటు ఇద్దరు కలిసి పార్టీ లు పబ్‌ లు అంటూ తిరిగారు. విదేశాలకు హాలీడే ట్రిప్స్‌ ను కూడా ఎంజాయ్‌ చేశారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఇద్దరి బ్రేకప్‌ వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వీరి బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేస్తున్నారు. కాని బాలీవుడ్ మీడియాలోని కొందరు ప్రముఖులు అనధికారికంగా వీరి బ్రేకప్‌ కు పెళ్లి కారణం అయ్యి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ప్రేమలో ఉన్న వీరిద్దరూ కూడా పెళ్లి గురించి చర్చ వచ్చిన తర్వాతే విడి పోయారని అంటున్నారు.

దిశా పటానీ గత కొన్నాళ్లుగా పెళ్లి గురించి టైగర్‌ ను ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన సమాధానం దాట వేస్తూ వచ్చాడట. ప్రస్తుతానికి పెళ్లి విషయం మాట్లాడవద్దని.. ఇద్దరం డేటింగ్ లో ఉందాం.. ఇద్దరం సహజీవనం చేద్దాం అన్నట్లుగా టైగర్ అన్నాడట.

దాంతో పెళ్లి వరకు వెళ్లని ఈ బంధం ను కొనసాగించడం అర్ధ రహితం అన్నట్లుగా దిశా పటానీ బ్రేకప్ చెప్పిందని వారు చెబుతున్నారు.

అసలు విషయం ఏంటి అనేది వారిలో ఎవరో ఒకరు స్పందిస్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. హీరోగా టైగర్.. హీరోయిన్ గా దిశా పటానీ బిజీగా ఉన్న సమయంలో ప్రేమ కెరీర్‌ కు అడ్డు కాకుడదు అనే ఉద్దేశ్యంతో ఇద్దరు బ్రేకప్‌ అయ్యి ఉంటారేమో అనేది మరి కొందరి అభిప్రాయం.