Begin typing your search above and press return to search.

సౌత్ పై షాకింగ్ కామెంట్స్.. రాశీఖన్నా వివరణ..!

By:  Tupaki Desk   |   6 April 2022 11:30 AM GMT
సౌత్ పై షాకింగ్ కామెంట్స్.. రాశీఖన్నా వివరణ..!
X
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా.. ఓవైపు సౌత్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్‌ చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలను ఇక్కడి ఆడియన్స్ ను తక్కువ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో రాశీఖన్నా పై దక్షిణాది ప్రేక్షకులు మండిపడ్డారు. అవకాశాలు అందించిన ఇండస్ట్రీని.. గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలను విమర్శించడం తగదని ఫైర్ అయ్యారు. ఆమె పై నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై రాశీఖన్నా స్పందించింది.

"సౌత్ సినిమాల గురించి నేను చెడుగా మాట్లాడినట్లు కొన్ని కల్పిత మరియు తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎవరు చేసినా దయచేసి ఆపివేయమని నేను అభ్యర్థిస్తున్నాను. నేను వర్క్ చేసే ప్రతి భాష లేదా సినిమా పట్ల నాకు చాలా గౌరవం ఉంది. దయతో ఉందాం" అని రాశీ ఖన్నా ట్విట్టర్ లో ఓ నోట్ రిలీజ్ చేసింది.

ఇటీవల రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ వాళ్లు తనను గ్యాస్‌ ట్యాంకర్‌ అంటూ వెక్కిరించారని చెప్పినట్లు కథనాలు వచ్చాయి. రోటీన్‌ గా ఉండటం నచ్చదు.. కానీ సౌత్ లో అడుగు పెట్టక దానికి అలవాటైపోయాను. అక్కడ చాలా కమర్షియల్‌ సినిమాల్లో నటించినప్పటికీ రోటిన్‌ ఫార్ములాతోనే ఉండిపోయాను. ఇకపై నా కథల ఎంపికలో మార్పును, నేను చేసే ప్రతీ సినిమాలో ఓ కొత్త రాశీఖన్నాను చూస్తారని తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

సౌత్ లో హీరోయిన్లను వారి ప్రతిభతో కాకుండా లుక్స్‌ పరంగా గుర్తింపు ఇస్తారు. హీరోయిన్లకు రకారకాల ట్యాగ్‌ లు ఇస్తారు. అది నాకు అసలు నచ్చదు. హీరోయిన్స్ లో అందం కంటే కూడా అంతకు మించి ప్రతిభ ఉందని సౌత్‌ ప్రేక్షకులు గుర్తించాలని రాశీ ఖన్నా అన్నట్లు నివేదికలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై రాశి ఖన్నా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే అవన్నీ తప్పుడు కథనాలని.. తనకు అన్ని సినిమాలపై, అన్ని భాషలపై గౌరవం ఉందని పేర్కొంది. అయితే ఈ పోస్ట్ కు నెటిజన్లు రిప్లై ఇచ్చే అవకాశం లేకుండా కామెంట్ సెక్షన్ బ్లాక్ చేయడం గమనార్హం. మరి ఇప్పుడు రాశిఖన్నా పై మండిపడుతున్న సౌత్ ఆడియన్స్ ఈ ప్రకటనతో శాంతిస్తారో లేదో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. రాశీ ఖన్నా ఇటీవల అజయ్ దేవగన్ తో కలిసి 'రుద్ర' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో 'థాంక్యూ' అనే మూవీ చేస్తోంది. అలానే 'పక్కా కమర్షియల్' సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.