Begin typing your search above and press return to search.

దొరసాని.. సైలెంట్‌ గా కానిచ్చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   27 Oct 2018 3:30 PM GMT
దొరసాని.. సైలెంట్‌ గా కానిచ్చేస్తున్నారు!
X
‘దొరసాని’.. ఈ టైటిల్‌ కొన్ని నెలలుగా టాలీవుడ్‌ లో వినిపిస్తూనే ఉంది. ఆమద్య రాజశేఖర్‌ పెద్ద కూతురు శివానీ హీరోయిన్‌ గా ఈ చిత్రంతో పరిచయం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆమె బాలీవుడ్‌ రీమేక్‌ తో అడవి శేషుతో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివానీ సినిమా మొదలైన తర్వాత శివాత్మిక హీరోయిన్‌ గా దొరసాని తెరకెక్కబోతుందనే వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు హల్‌ చల్‌ చేసిన ‘దొరసాని’ వార్తలు ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అసలు దొరసాని ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌ గా - విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ‘దొరసాని’ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఒక పల్లెటూరులో ఈ చిత్రీకరణ జరుపుతున్నారట. ఎలాంటి హడావుడి లేకుండా చిత్రాన్ని ప్రారంభించిన చిత్ర యూనిట్‌ సభ్యులు అంతే సైలెంట్‌ గా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈమద్య కాలంలో సినిమాకు స్టోరీ ఓకే అయినప్పటి నుండి విడుదలయ్యే వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాని ‘దొరసాని’ విషయంలో మాత్రం అలా చేయాలని భావించడం లేదట.

‘దొరసాని’ చిత్రీకరణ ప్రారంభించినట్లుగా కూడా యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే ఈ చిత్రం పై ఇప్పటి నుండే అంచనాలు పెంచడం చిత్ర యూనిట్‌ సభ్యులకు ఇష్టం లేనట్లుంది. అందుకే సైలెంట్‌ గా కానిచేస్తున్నారు. టీజర్‌ విడుదలతో సినిమా ప్రమోషన్‌ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఈ చిత్రానికి మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇద్దరు కొత్త వారే అయినా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకుల్లో వీరిద్దరిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను దొరసాని అందుకుంటుందా చూడాలి. సినిమా గురించి ఎప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి.