Begin typing your search above and press return to search.

మిస్ ఇండియా పోటీలో శివాని రాజశేఖర్ తొలి అడుగు

By:  Tupaki Desk   |   1 May 2022 11:30 AM GMT
మిస్ ఇండియా పోటీలో శివాని రాజశేఖర్ తొలి అడుగు
X
మిస్ ఇండియా 2022 అందాల పోటీలో తుది జాబితాలో చేరిన వారిలో శివాని రాజశేఖర్ ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ నుండి వెలువడిన 8 మంది ఫైనలిస్టులలో త‌న పేరు ఉంది. ఈ పోటీల్లో శివానీ రాజ‌శేఖ‌ర్ తెలంగాణ- తమిళనాడు రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని టాప్ 31 జాబితాలో చేరేందుకు శివాని 3000 మందికి పైగా తోటి ఆశావహులను అధిగమించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఫైనల్ కు చేరిన వారిలో ఈ అందాల న‌టి ఒకరు అయినప్పటికీ తర్వాతి దశల్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాధృచ్ఛికంగా శివాని చెన్నైలో జన్మించినందున ఆమెకు బలమైన తమిళనాడు అనుబంధం ఏర్పడింది. చాలా మంది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు మద్రాసులో పుట్టి పెరిగారు.

ప్రతిష్టాత్మక మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలనేది శివానీ రాజ‌శేఖ‌ర్ చిన్ననాటి కల అని తెలిసింది. అందుకే ఆమె ఇప్పటికే సినిమాల్లో ప్రతిభను నిరూపించుకోవాల‌నుకున్నా కానీ.. అందాల‌ పోటీలపైనే దృష్టి సారించింది. ఈ సీజన్ లో ఎంతో క్రేజీగా టైటిల్ ను గెలుచుకుంటే శివాని బాలీవుడ్ లోనూ పాపుల‌ర్ నేమ్ గా మారడం ఖాయం. ఇప్పటికే ముంబైలో మూడు రోజుల పాటు ఆడిషన్ చేసిన శివానీ పోటీకి పూర్తిగా సిద్ధమవుతోంది.

క‌థానాయిక‌గా ఇప్ప‌టికే న‌టించిన శివానీకి పలు భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మే 20న రాజశేఖర్ తో క‌లిసి న‌టించిన `శేఖర్` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శివానిది ప్రత్యేక పాత్ర. ఈ బ్యూటీ 8 ఎపిసోడ్ ల ZEE5 వెబ్ సిరీస్ లో `అహ నా పెళ్లంట` కూడా చేస్తోంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ ఇది. రాజ్ తరుణ్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. అందాల పోటీల్లో తెలుగ‌మ్మాయి శివానీ హ‌వా కొన‌సాగాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.