Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో మళ్ళీ పాతాళగంగ ఓపెన్ చేసిన జ్యోతి!

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:56 AM GMT
బిగ్‌ బాస్‌ లో మళ్ళీ పాతాళగంగ ఓపెన్ చేసిన జ్యోతి!
X
బిగ్‌ బాస్ హౌస్ లో ఏడుపులో నెంబర్ 1 ఎవరంటే ? అందరూ శివజ్యోతి పేరు ఠక్కున చెప్పేస్తారు. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ లలో ఉత్తిగానే ట్యాప్ తిప్పేసే జ్యోతి పాతాళగంగ అని పేరు తెచ్చుకుంది. అయితే నిదానంగా ఏడుపుని కంట్రోల్ చేసుకున్న జ్యోతి..అలీ నామినేషన్ సమయంలో గుక్కపెట్టి ఏడ్చింది...మళ్ళీ ఆ తర్వాత బుధవారం ఎపిసోడ్‌ లో పాతాళగంగ ఓపెన్ చేసింది. బిగ్ బాస్ కాలేజ్ టాస్క్‌ లో భాగంగా బాబా భాస్కర్ లెక్చరర్ గా రిలేషన్ షిప్స్ గురించి చెబుతూ....శివజ్యోతిని ఉదాహరణగా తీసుకున్నారు.

జ్యోతి ఎవరితోనైనా ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుందని... మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ అయ్యేటప్పుడు బాగా బాధపడుతుందని చెప్పాడు. కానీ జ్యోతికి అది వేరేగా అర్ధమైంది. గేమ్ ఆడకుండా తాను వేరే వాళ్ళ మీద ఎమోషనల్ గా డిపెండ్ అవుతున్నానని అనుకుంది. దీంతో జ్యోతి ఓ రేంజ్ లో ఏడుపు మొదలుపెట్టింది. రాహుల్ ఓదార్చినా ఆగలేదు. అనంతరం బాబా సీన్ లోకి వచ్చి...తాను అలా అనలేదని నువ్ అన్నిటికి ఎమోషనల్ కాకుండా స్ట్రాంగ్ గా ఆడాలనే చెప్పానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయం నలుగురులో కాకుండా.. నా ఒక్కదానికే చెబితే బాగుండేది అని చెబుతూ గుక్క పెట్టి ఏడ్చింది.

ఇక జ్యోతిని ఓదార్చడం బాబా వల్ల కాలేదు. చాలాసేపు తనకు వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ అర్ధమయ్యేలా చెప్పడంతో...జ్యోతి ఆగింది. ఆ తర్వాత రాహుల్... హిమజ ఎలిమినేషన్ ప్రక్రియలో కావాలనే మహేశ్ ని ఇరికించిందని బాబా భాస్కర్ కు చెప్పే ప్రయత్నం చేశాడు. హిమజ కావాలనే బట్టలు - మేకప్ పూర్తిగా స్టోర్ రూమ్ లో పెట్టలేదని అన్నాడు. హిమజ ఈ విషయాన్ని వితికాకు చెప్పిందని...అదే నా వరకు వచ్చిందని చెప్పాడు. మీరు కూడా ఎవరికి ఈ విషయం చెప్పొద్దని రాహుల్ బాబాకు రిక్వెస్ట్ చేశాడు. దీంతో బాబా కూడా ఎవరికి చెప్పనని మాట ఇచ్చాడు.