Begin typing your search above and press return to search.

శిల్పాశెట్టి-కుంద్రా 12వ వివాహ వార్షికోత్స‌వం

By:  Tupaki Desk   |   22 Nov 2021 5:16 AM GMT
శిల్పాశెట్టి-కుంద్రా 12వ వివాహ వార్షికోత్స‌వం
X
శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా జంట నేడు 12వ వివాహ వార్షికోత్స‌వం జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను ఈ జంట సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ జంట గత కొన్ని నెలలుగా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వేడుక‌ను సాధా సీదాగా నిర్వ‌హించారు. శిల్పా - రాజ్ వర్లీలోని వారి స్వంత రెస్టారెంట్ లో నిశ్శబ్ద శృంగార విందు కోసం ప్లాన్ చేసారు.

శిల్పా త‌మ‌ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమపూర్వకమైన నోట్ ను రాసింది. త‌మ‌ వివాహ ఆచారాల నుండి అమూల్యమైన ఫోటోల‌ను పంచుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసింది. ``ఈ క్షణం ఈరోజు 12 సంవత్సరాల క్రితం మేము ఒక వాగ్దానం చేసుకున్నాం. దానిని కొనసాగిస్తున్నాం. గుడ్ టైమ్ ని పంచుకోవడం.. కష్ట సమయాలను భరించడం.. ప్రేమను విశ్వసించడం.. భగవంతుడు మనకు మార్గం చూపడం...రోజు వారీ ప్ర‌క్రియ‌లు. 12 సంవత్సరాలు లెక్కించబడటం లేదు... వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మరెన్నో ఇంద్రధనస్సులు.., నవ్వులు,.. మైలురాళ్ళు ..మా విలువైన ఆస్తులు పిల్ల‌లు ఇక్కడ ఉన్నారు. మాతో ఉన్న మా శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు`` అని తెలిపారు. 22 నవంబర్ 2009న శిల్పా - రాజ్ వివాహం చేసుకున్నారు. 2012లో తల్లిదండ్రులు కొడుకు వియాన్ గా మారారు. 2020లో సరోగసీ ద్వారా కుమార్తె సమీషాకు స్వాగతం పలికారు.

శిల్పా శెట్టి `స్నేహం`పైనా పోస్ట్ ను పంచుకున్నారు. నా జీవితంలో ఉన్నందుకు స్నేహితులంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జూలైలో రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి పంపిణీ వ్యాపారం చేశార‌న్న‌ ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల జైలు శిక్ష తర్వాత సెప్టెంబర్ లో బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుండి రాజ్ కుంద్రా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నాడు.

ఎరుపు రంగు పట్టు చీర - ఆభరణాలలో శిల్పా వధువుగా అద్భుతంగా కనిపిస్తోంది. రాజ్ సరిపోలే షేర్వానీ- తలపాగా- సెహ్రాలో వరుడిగా కనిపించాడు. వీరిద్దరు హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు. శిల్పా నటిగా రియాల్టీ షో న్యాయనిర్ణేత గా రాణిస్తోంది. రాజ్ వ్యాపారవేత్త. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 ఏళ్ల కుమారుడు వియాన్ రాజ్ కుంద్రా మరియు ఏడాది వ‌య‌సు కుమార్తె సమీషా ఉన్నారు.

ఈ జంట ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు మతపరమైన యాత్ర కోసం వెళ్లారు. రాష్ట్రంలోని కొన్ని ఆలయాలను సందర్శిస్తూ కనిపించారు. గతంలో శిల్పా రాజ్ జైలులో ఉన్న సమయంలో జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.