Begin typing your search above and press return to search.

ఆ జంట దేవుడ్ని మొక్కితే అన్ని లక్షల మంది చూడటమా?

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:10 AM GMT
ఆ జంట దేవుడ్ని మొక్కితే అన్ని లక్షల మంది చూడటమా?
X
గత ఏడాది వార్తల్లో నిలిచారు సెలబ్రిటీ జంటగా బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి.. ఆమె రాజకుంద్రాలు. రోత పుట్టించే బూతు సినిమాలు తీయటంతో పాటు.. సంచలన ఆరోపణలతో అడ్డంగా బుక్ అయి.. జైలు ఊచలు లెక్క పెట్టి.. బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రా లీలలు అంటూ పలు వార్తలు బయటకు రావటమే కాదు.. ఒక దశలో భర్తతో శిల్పాశెట్టి తెగతెంపులు చేసుకుంటారన్న వరకు ప్రచారం సాగింది.

అయితే.. ఆ అంచనాలకు భిన్నంగా జైలు నుంచి వచ్చిన తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి పోవటం.. జంటగా గుళ్లకు తిరుగుతూ దేవుడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిని డిలీట్ చేశారు రాజ్ కుంద్రా. ఇప్పుడిప్పుడే కేసు చికాకుల నుంచి బయటకు వస్తున్న ఆయన.. దాని నుంచి బయటపడే మార్గాలు వెతుకుతున్నట్లుగా చెబుతున్నారు. తానేం తప్పు చేయలేదంటున్న ఆయన.. పనిలో పనిగా భార్యను వెంటపెట్టుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్లి.. దేవుడి ఆశీస్సుల్ని పొందుతున్నారు.

తాజాగా ప్రసిద్ధ షిర్డీ ఆలయంలో.. సాయిబాబా దర్శనాన్ని చేసుకున్నారు. దీనికి సంబంధించిన పాతిక సెకండ్ల నిడివి ఉన్న వీడియోను ఒకటి శిల్పా శెట్టి షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్ నకు ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ శ్రద్ధ.. పట్టుదల.. ఓం సాయిరామ్ అనే క్యాప్షన్ పేర్కొన్నారు. ఈ సెలబ్రిటీ జంట సాయిబాబా ముందు ముఖానికి మాస్కులు పెట్టుకొని.. స్వామి దర్శనం పొందారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాల్ని ధరించారు.

శిల్పాతో పోలిస్తే.. రాజ్ కుంద్రానే సాయిబాబా దర్శనం సందర్భంగా.. కాస్తంత ఎక్కువ భక్తిని ప్రదర్శించినట్లుగా వీడియోను చూస్తే కనిపిస్తుంది. సాయిబాబా దర్శన వేళ.. రాజ్ కుంద్రా చేతులు జోడించి.. శిరస్సును వంచి మరీ ప్రార్థన చేస్తే.. శిల్పాశెట్టి మాత్రం పూర్తిగా టచ్ చేయకుండా.. మమ అనిపించటం కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోను కేవలం ఐదు గంటల వ్యవధిలో 10లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఆమె ఖాతాలో ఇటీవల కాలంలో పోస్టు చేసిన ఫోటోలు.. వీడియోల్లో దేనికి లేనంతగా ఈ వీడియోను చూడటం విశేషం. అంతా.. సాయి మహిమ అనుకోవాలేమో?