Begin typing your search above and press return to search.

'స్టార్స్ భార్యలందరూ వాష్‌ రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు'

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:00 PM GMT
స్టార్స్ భార్యలందరూ వాష్‌ రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు
X
బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు దీపిక పడుకునే - సారా ఆలీఖాన్ - శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఎన్సీబీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రగ్ వ్యహారాలపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. హీరోయిన్ షెర్లీన్ చోప్రా మాట్లాడుతూ.. 'నీ బ్రెస్ట్ రియలేనా? ఫేక్ నా? నేను వాటిని టచ్ చేయొచ్చా' అని క్వాన్ అధినేత అనిర్భన్‌ ఓ సందర్భంలో అడిగాడని పేర్కొంది. ఈ క్రమంలో ఓ నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఐపీఎల్‌ క్రికెట్‌ లో కోల్‌ కతా నైట్ రైడర్స్‌ టీమ్‌ పై సంచలన ఆరోపణలు చేసింది.

''నేను ఒకసారి KKR ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్ చూడటానికి కోల్‌ కతాకు వెళ్లాను. ఆ మ్యాచ్ తరువాత నన్ను పార్టీకి ఆహ్వానించాను. దీనికి ప్రముఖ క్రికెటర్లు మరియు వారి భార్యలు అందరూ హాజరయ్యారు. నేను పార్టీలో చాలా ఎంజాయ్ చేశాను. అయితే నేను డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత వాష్‌ రూమ్‌ కు వెళ్లాను. అక్కడ నేను చూసిన దృశ్యం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ స్టార్ భార్యలందరూ వాష్‌ రూమ్ ప్రాంతంలో కొకైన్ తీసుకుంటున్నారు. వారు నన్ను చూసి నవ్వారు. నేను తిరిగి నవ్వాను. నేను రాంగ్ ప్లేస్‌ లో ఉన్నానని అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇంకా అప్పటికీ పార్టీ ఫుల్ స్వింగ్‌ లోనే కొనసాగుతున్నది. ఒకదాని తర్వాత మరో డ్రగ్ పార్టీ జోరుగా సాగుతున్నది. ఒకవేళ పురుషుల బాత్రం వద్దకు వెళ్లి ఉంటే అలానే కనిపించి ఉండేదేమో'' అని షెర్లీన్ చోప్రా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న సమయంలో షెర్లీన్ ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందులోనూ కోల్‌ కతా నైట్ రైడర్స్‌ టీమ్‌ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు చెందిందనే విషయం తెలిసిందే.