Begin typing your search above and press return to search.

ఈసారి బాలీవుడ్ భామ వైపు మొగ్గు చూపుతున్న స్టార్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 2:30 AM GMT
ఈసారి బాలీవుడ్ భామ వైపు మొగ్గు చూపుతున్న స్టార్ డైరెక్టర్..!
X
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల - కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సినిమాల పరంగా రెండు విభిన్న దృవాలైన ఇద్దరు జాతీయ అవార్డ్ గ్రహీతలు కలిసి వర్క్ చేస్తుండటంతో.. ఈ అరుదైన కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన ధనుష్.. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని అందరూ చెప్పుకున్నారు.

అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి.. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు ధనుష్. ఇది తన తెలుగు డెబ్యూగా పేర్కొన్నారు. ముందుగా వెంకీ ద్విబాషా చిత్రాన్ని ప్రారంభించడానికి కారణం.. శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ చేయకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది.

ధనుష్ కోసం శేఖర్ కమ్ముల పొలిటికల్ థ్రిల్లర్‌ కథని రెడీ చేస్తున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకుంటారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పటికే సాయి పల్లవితో 'ఫిదా' 'లవ్ స్టోరీ' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు శేఖర్ కమ్ముల.

అందులోనూ 'మారి 2' సినిమాలో ధనుష్ - సాయి పల్లవి ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో.. శేఖర్ కమ్ముల మూడోసారి ఆమెనే రిపీట్ చేస్తారని అందరూ భావించారు. అయితే దర్శకుడు ఈసారి సాయి పల్లవిని కాకుండా.. వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. పాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ లో క్రేజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట.

దీనిని బట్టి శేఖర్ కమ్ముల - సాయి పల్లవి ల హ్యాట్రిక్ మూవీ ఇప్పట్లో కుదరకపోవచ్చని అనుకోవాలి. కాగా, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - పి.రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.