Begin typing your search above and press return to search.

ఔను విడిపోయాం.. షన్నూ ఎమోషనల్ పోస్ట్‌ వైరల్‌

By:  Tupaki Desk   |   1 Jan 2022 3:30 PM GMT
ఔను విడిపోయాం.. షన్నూ ఎమోషనల్ పోస్ట్‌ వైరల్‌
X
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 ముగిసినప్పటి నుండి ఒక వార్త సోషల్‌ మీడియాను కుదిపేస్తుంది. అదే దీప్తి సునైన మరియు షన్నూల ప్రేమ వ్యవహారం. మొదట అది పుకారే అని అంతా అనుకున్నారు.. కాని షన్నూ లైవ్‌ లో వచ్చి దీప్తి నన్ను బ్లాక్ చేసిందని చెప్పడంతో ఇద్దరి మద్య ఏదో తేడా కొట్టిందని.. ఎక్కడో బెడిసింది అనే చర్చకు మరింత బలం చేకూరి నట్లయింది. షన్నూ మాట్లాడుతూ ఆమె అప్పుడప్పుడు నన్ను బ్లాక్ చేస్తుంది. హైదరాబాద్ వెళ్లి ఒకసారి దీపుతో మాట్లాడాలి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కాకున్నా ఇంకొన్ని రోజుల తర్వాత అయినా ఇద్దరి మద్య రాజీ కుదురుతుందని.. మళ్లీ ఇద్దరు కలుస్తారని అభిమానులు ఆశించారు. కాని ఇద్దరు మళ్లీ కలవనంత దూరం విడిపోయారు అని దీప్తి సునైన పోస్ట్‌ ద్వారా తేలిపోయింది.

దీప్తి సునైన సోషల్‌ మీడియా పోస్ట్‌ తో ఇద్దరి మద్య బ్రేకప్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే ఈ బ్రేకప్‌ పట్ల షన్నూ ఎలా రియాక్ట్‌ అవ్వబోతున్నాడు అనేది కూడా కొందరు ఆసక్తిగా చూశారు. షన్నూ ఏమైనా రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తాడా అని కొందరు ఎదురు చూశారు. కాని షన్నూ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మేము విడిపోయాం అన్నట్లుగా షన్నూ బ్రేకప్‌ ను మరింత క్లారిటీ ఇచ్చేశాడు. తప్పు అంతా తన వైపు ఉంది అన్నట్లుగా.. తనను ఇన్నాళ్లు దీపు భరించినందుకు కృతజ్ఞతలు చెబుతూ విడిపోతున్నట్లుగా ప్రకటించాడు. నిర్ణయాన్ని తీసుకునే హక్కు ఆమెకు ఉంది. ఇప్పటి వరకు ఆమె నా వల్ల చాలా ఇబ్బంది పడింది. ఈ అయిదేళ్లు ఎంతో ఆనందంగా గడిచింది. ఈ అయిదు సంవత్సరాల పాటు నీ సపోర్ట్‌ తో చాలా నేర్చుకున్నాను అన్నట్లుగా షన్నూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు.

గతంలో బిగ్‌ బాస్ కు దీప్తి సునైన వెళ్లిన సమయంలో ఒక కంటెస్టెంట్‌ తో క్లోజ్ గా ఉండటంతో కూడా ఇద్దరి మద్య బ్రేకప్‌ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇద్దరి మద్య ఉన్నది స్నేహమే అవ్వడంతో దీప్తి మరియు షన్నుల ప్రేమ కొనసాగింది. అయితే ఈసారి వీరి బ్రేకప్‌ కారణం సిరితో షన్నూ వ్యవహరించిన తీరు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తన్నారు. బిగ్‌ బాస్ వ్యవహారాలను పరిగణలోకి తీసుకు షన్నూ తో బ్రేకప్‌ అవ్వడం పద్దతి కాదు అన్నట్లుగా దీప్తి కి కొందరు సోషల్‌ మీడియా ద్వారా సలహా ఇస్తున్నారు. కాని ఇద్దరి మద్య అంతకు మించి ఏమైనా జరిగి ఉండవచ్చు.. అది వారి వ్యక్తిగత విషయం. వారి జీవితంలో ఎన్నో వ్యక్తిగత విషయాలు ఉంటాయి.. కనుక వారి విషయంలో ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడవద్దంటూ వారి కామన్‌ స్నేహితులు సోషల్‌ మీడియా ద్వారా జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.