Begin typing your search above and press return to search.

RC15 లాంచింగ్ ఈవెంట్లో శంక‌ర్ తో ఆమె ఎవ‌రు?

By:  Tupaki Desk   |   9 Sep 2021 8:31 AM GMT
RC15 లాంచింగ్ ఈవెంట్లో శంక‌ర్ తో ఆమె ఎవ‌రు?
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రం ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకం పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి బాలీవుడ్ నుంచి హీరో ర‌ణ‌వీర్ సింగ్ అతిధిగా హాజ‌ర‌య్యారు. ఇంకా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్. ఎస్ రాజ‌మౌళి...ప్ర‌త్యేక అతిధిగా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు.

మెగాస్టార్ చేతుల మీదుగా ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చి ప్రారంభించ‌గా ఈ వేడుక‌లో ఓ కోలీవుడ్ హీరోయిన్ కూడా పాల్గొన్నారు. అయితే అప్ప‌టికి ఆమె ఎవ‌రు? అన్న‌ది ఎవరికీ తెలియ‌దు. డెబ్యూ న‌టిగా ఎంట్రీ ఇస్తోంది కాబ‌ట్టి త‌న గురించి తెలుగు వారికి తెలిసే అవ‌కాశం క‌ల‌గ‌లేదు.

ఇంత‌కీ త‌ను ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే.. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితిశంక‌ర్ అని తెలిసింది. శంక‌ర్ తో పాటు అదితి కూడా లాంచింగ్ కి హైద‌రాబాద్ వ‌చ్చారు. అయితే తండ్రి బాట‌లో ఆమె మేక‌ర్ కావ‌డం లేదు. అదితి ఇప్ప‌టికే కోలీవుడ్ లో హీరోయిన్ గా ఓ సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే అదితి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో కార్తీ హీరోగా న‌టిస్తున్నారు. ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సూర్య నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా లాంచ్ అవుతోన్న సంద‌ర్భంగా అదితి కి కోలీవుడ్ గ్రాండ్ గా వెల్క‌మ్ కూడా చెప్పింది.

అయితే హైద‌రాబాద్ లో వాలిన అతిది ఈవెంట్ రోజున తండ్రి శంక‌ర్- రాజ‌మౌళి మ‌ధ్య‌లో నిల‌బ‌డి ఓ ఫోటో కూడా దిగింది. ఆ ఫోటోని న్ స్టాలో `నాకు ఇష్ట‌మైన ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో`` ఇలా అంటూ షేర్ చేసింది. ఇద్ద‌రి బిగ్ క్రియేటర్స్ మ‌ధ్య ఇలా డెబ్యూ నాయిక‌ నిల‌బ‌డ‌టం ఎంతో గౌర‌వంగా ఉంద‌ని ట్యాగ్ చేసింది. మ‌రి అతిది ప‌నిగ‌ట్టుకుని హైద‌రాబాద్ ఎందుకు వచ్చిన‌ట్లు అంటే? టాలీవుడ్ చిత్రాల‌పైనా ఆమె ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా నలుగురితో ఇంట‌రాక్ట్ అయితే ఆ ప‌రిచయాల‌తో టాలీవుడ్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల నుంచి పిలుపు వచ్చే అవ‌కాశం ఉంది. అందుకే ఆ ఛాన్స్ ని ఎంత మాంత్రం మిస్ చేసుకోకూడ‌ద‌ని తండ్రితో క‌లిసి ల్యాండ్ అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. కొలీగ్ శంక‌ర్ వార‌సురాలు కాబ‌ట్టి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు.

అంద‌రూ స‌ర్ ప్రైజింగ్ గెస్టులే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాథానాయ‌కుడిగా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో RC15 బుధవారం ప్రారంభ‌మైంది. ఇంత‌కుముందే పోస్టర్ ని లాంచ్ చేయ‌గా వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఈ పోస్ట‌ర్ లో ఆర్సీ 15లో న‌టిస్తున్న‌ కొంద‌రు ముఖ్య తారాగణం సిబ్బంది ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కూడా సూట్ ధ‌రించి చ‌ర‌ణ్ -శంక‌ర్ - కియ‌రాల‌తో పాటు ఈ పోస్ట‌ర్ లో ఎంతో స్టైలిష్ గా క‌న‌ప‌బ‌డ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పోస్ట‌ర్ లో నటులు రామ్ చరణ్- కియారా అద్వానీ- జయరామ్- సునీల్- అంజలి- నవీన్ చంద్ర ఉన్నారు. దర్శకుడు శంకర్- నిర్మాత దిల్ రాజు- సినిమాటోగ్రాఫర్ ఎస్ తిరునావుక్కరసు- మ్యూజిక్ కంపోజర్ ఎస్ థమన్ ఇతరులు కూడా ఉన్నారు.

లాంచ్ కార్యక్రమంలో రణవీర్ సింగ్- రామ్ చ‌ర‌ణ్‌- కియారా అద్వానీ త‌దిత‌రులు ఉన్నారు. శంకర్ తో కలిసి హిందీ రీమేక్ అన్నీయాన్ లో న‌టిస్తున్న ర‌ణ్ వీర్.. ఈరోజు ఎస్.వి.సి 50 లాంచ్ వేడుక‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆస‌క్తిక‌రంగా ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు. ఆయన చాలా సేపు శంక‌ర్ ష‌న్ముగంతోనే గ‌డిపారు. ``కొన్ని ప్రాజెక్ట్‌లు ప్రత్యేకమైనవి! ఇది అలాంటిది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో పనిచేయడం ఒక కల. రామ్ చ‌ర‌ణ్ కి ఆ కల సాకారం కాబోతోంది`` అంటూ చిరు ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసారు.

ఇంత‌కీ టైటిల్ ఎంపిక చేశారా?

రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ఏమిటి? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఇంత‌కుముందు గ్రాంధిక‌మైన‌ టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. శంకర్ ఈ చిత్రానికి `విశ్వంభర` అనే టైటిల్ ని ఫైనల్ చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనిని టీమ్ ప్ర‌క‌టించాల్సి ఉంది.