Begin typing your search above and press return to search.

శర్వా కి ఇద్దరు సెట్ అయినట్టే

By:  Tupaki Desk   |   2 Nov 2017 9:48 AM GMT
శర్వా కి ఇద్దరు సెట్ అయినట్టే
X
పండగ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శర్వానంద్ సినిమా సినిమాకి మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. రాదా సినిమాతో కొంచెం తడబడ్డ శర్వా మహానుభావుడు సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. పోటీగా స్పైడర్ వచ్చినా కూడా ఏ మాత్రం తడబడలేదు ఈ కుర్ర హీరో. అంతే కాకుండా ఇక నుండి తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ ను చక్కగా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

అయితే శర్వానంద్ మొదట్లో ప్రయోగాత్మకమైన కథలను ఎక్కువగా ఎంచుకునేవాడు. కానీ ప్రేక్షకులను పూర్తిగా తన వైపు మళ్లించడానికి ఎంటర్టైన్ చేసే కథలను అందుకొని మళ్లీ పాత జానర్ సినిమాలకు కూడా అలవాటు చెయ్యాలని అనుకుంటున్నాడు. స్వామి రారా - కేశవ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుదీర్ వర్మ దర్శకత్వంలో సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తిగా మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఉండనుందని తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే శర్వానంద్ మొదటి సరి ఇద్దరు హీరోయిన్స్ తో ఈ సినిమాలో నటించనున్నాడట. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే అలాగే క్యూట్ హీరోయిన్ నివేద థామస్ ని చిత్ర యూనిట్ రీసెంట్ గా సెలక్ట్ చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కబోతోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.