Begin typing your search above and press return to search.

షారూఖ్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు!!

By:  Tupaki Desk   |   22 Aug 2016 5:42 AM GMT
షారూఖ్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు!!
X
బాలీవుడ్ బాద్ షా - కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోయిన్ ప్రీతీ జింతాకు క్షమాపణలు చెప్పారు. షారుఖ్ ఏమిటి - ఈ మధ్యకాలంలో ప్రీతీ జింతా తో సినీమాలు కూడా పెద్దగా ఏమీ చేయడంలేదు కదా.. ఉన్నట్లుండి ఈ క్షమాపణలు ఏమిటి అనుకుంటున్నారా? అలా అయితే ఈ విషయం చదవాల్సిందే. పైగా.. షారుఖ్ క్షమాపణలు చెప్పి, చేసిన తప్పును సరిదిద్ధుకున్న ఈ సంఘటన తాజాగా బాలీవుడ్ లో ఇంటస్ట్రింగ్ టాపిక్స్ లో ఒకటి గా మారింది.

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్.. హీరోయిన్ ప్రీతి జింతా కలిసి నటించిన "దిల్ సే" సినిమా ఏస్థాయి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 18 ఏళ్లు పూర్తైన కూడా ఈ సినిమా సంగతులు - ఈ సినిమా పాటలు - నాడు నెలకొల్పిన రికార్డులు ఎప్పటికీ హాట్ టాపిక్కే. అయితే ఈ సినిమా విడుదలై 18ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా షారూఖ్ ఎంతో ఇష్టంగా - ప్రత్యేకంగా తయారు చేసిన ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. "మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడినప్పుడు వారిని ఎంతగానో ప్రేమిస్తాం.. అయితే ఎప్పుడూ ఆ స్థాయిలో ఎక్కువగా ప్రేమించడం సాధ్యంకాకపోవచ్చు.. కానీ నాకు ఎంతో ఇష్టమైన దిల్ సే సినిమాపై ప్రేమ మాత్రం కాస్త కూడా తగ్గలేదు" అని ఇన్ స్టాగ్రామ్ వీడియోతో పాటు ఈ మెసేజ్ పెట్టాడు. అయితే ఈ వీడియోలో హీరోయిన్ ప్రీతి జింతా ప్రస్తావన లేకపోవడంపై షారుఖ్ క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియోలో ప్రీతీ ప్రస్తావన రాకపోవడంపై సారీ అని చెబుతూనే, తప్పును సరిదిద్ధుకుని ప్రీతి జింతాను కూడా చేర్చి మరో వీడియో పోస్ట్ చేశాడు.

కాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ "దిల్ సే" సినిమా ఆగస్టు 21 - 1998న విడుదలైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన ప్రీతి జింతా - మనీషా కొయిరాల నటించారు. తీవ్రవాదం నేపథ్యంలో సాగుతూ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం- రాంగోపాల్ వర్మ - భరత్ షా - శేఖర్ కపూర్ లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రీతి జింతా బాలీవుడ్ కు పరిచయమైంది.