Begin typing your search above and press return to search.

'సేనాపతి' తో 'ఆహా' అనిపిస్తున్న బాలయ్య 'అన్ స్టాపబుల్'..!

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:16 PM GMT
సేనాపతి తో ఆహా అనిపిస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్..!
X
తెలుగు ప్రేక్షకులను 100 శాతం వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతున్న తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ''ఆహా''. వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త కంటెంట్ ని అందుబాటులో ఉంచుతోంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలు - బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా ఒరిజినల్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తోంది. అలానే స్పెషల్ టాక్ షోలు - గేమ్ షోలను అందిస్తూ మిగతా డిజిటల్ వేదికల కంటే 'ఆహా' ప్రత్యేకంగా నిలుస్తోంది.

కొత్త సంవత్సరం 2022 కి స్వాగతం పలుకుతూ ఈ ఏడాది చివర్లో సరికొత్త కంటెంట్ ని అందించడానికి ఆహా రెడీ అయింది. ఇందులో భాగంగా ''సేనాపతి'' అనే సరికొత్త వెబ్ సిరీస్ ని విడుదల చేస్తోంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయనకు ఓటీటీ డెబ్యూ.

''సేనాపతి'' చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. 'ఆహా' ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ ఒరిజినల్ లో రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్ లో నటించారు. నరేష్ అగస్త్య - జ్ఞానేశ్వర్ కందేర్గుల - హర్షవర్దన్ - రాకేందు మౌళి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల - అల్లుడు విష్ణు ప్రసాద్ ఈ ఓటీటీ వెంచర్ ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన 'సేనాపతి' ప్రచార చిత్రాలు - ట్రైలర్ ఈ మూవీపై ఆసక్తిని కలిగించాయి. రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.

ఇకపోతే 'ఆహా' ఓటీటీలో సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో సరికొత్త ఎపిసోడ్ రేపు (డిసెంబర్ 31) శుక్రవారం నుంచి ప్రసారం కానుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ స్పెషల్ షో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుందనే సంగతి తెలిసిందే.

పలువురు సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరైన ఈ షో.. బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన ఆరు ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ క్రమంలో 7వ ఎపిసోడ్ లో మాస్ మహారాజా రవితేజ సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అయింది.

బాలకృష్ణ - రవితేజ మధ్య గొడవ జరిగిందనే విషయం మీద ఈ ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చారు. అలానే డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం గురించి వెల్లడించిన అంశాలు హైలైట్ అవనున్నాయి. ఎనర్జిటిక్ గా సాగిన ఈ షోకు 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా విచ్చేశారు. రవితేజ - గోపీచంద్ మలినేని లతో బాలయ్య జరిపిన ఆసక్తికరమైన సంభాషణ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.