Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డు దర్శకుడిని వద్దనుకున్నారే!

By:  Tupaki Desk   |   29 May 2019 6:26 AM GMT
జాతీయ అవార్డు దర్శకుడిని వద్దనుకున్నారే!
X
గత ఏడాది ఎన్నో అంచనాలతో తన బ్యానర్ లోనే గొప్ప కుటుంబ కథా చిత్రం అవుతుందని దిల్ రాజు చెప్పుకున్న నితిన్ శ్రీనివాస కళ్యాణం భారీ డిజాస్టర్ గా మిగలడం ఆయన అంత ఈజీగా మర్చిపోయేది కాదు. సక్సెస్ మీట్లు పెట్టి పదే పదే అందరూ ఆదరించారని చెప్పుకున్నా ఫైనల్ గా ఫలితం చాలా చేదుగా వచ్చింది. అప్పట్లో దర్శకుడు సతీష్ వేగ్నేశతో థాంక్స్ అనే మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు కాని అది ఎంతకీ ముందుకు కదలలేదు.

రాజు గారి బ్యానర్ లోనే శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డు ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తాడనే అనుకున్నారు అందరూ. కాని జరుగుతోంది వేరు. కొన్ని నెలల పాటు ఎదురు చూసిన సతీష్ వేగ్నేశ అదే కథతో మరో నిర్మాతను ఒప్పించినట్టు తెలిసింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇది పట్టాలు ఎక్కబోతున్నట్టుగా రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ధృవీకరణ రాలేదు. అదే కథతోనే టైటిల్ మార్చి తీస్తారని వినికిడి.

స్టొరీ లేకుండా పెళ్లి క్యాసెట్ తీసినట్టు రూపొందిన శ్రీనివాస కళ్యాణంలోని తప్పులు మళ్ళి రిపీట్ కాకుండా సతీష్ కొత్త కథలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. కళ్యాణ్ రామ్ హీరో అంటే మాస్ అంశాలు ఉండాలి. కొంచెం కొత్తగా థ్రిల్లర్ జానర్ లో అతను చేసిన 118 పెట్టుబడి లెక్కల్లో బాగానే ఆడిందని చెప్పుకున్నారు. సో సతీష్ ఏదైనా డిఫరెంట్ లైన్ చెప్పినా కళ్యాణ్ రామ్ నో చెప్పే ఛాన్స్ ఉండదు. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఇంకొద్ది రోజుల్లో రావొచ్చు