Begin typing your search above and press return to search.

కోమలీతో కలిసి 'పలాస 1978' హీరో చేస్తున్న 'శశివదనే'

By:  Tupaki Desk   |   17 Nov 2021 2:30 AM GMT
కోమలీతో కలిసి పలాస 1978 హీరో చేస్తున్న శశివదనే
X
యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి 'పలాస 1978' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు రక్షిత్ హీరోగా ''శశివదనే'' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

'శశివదనే' సినిమాని మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన మాట్లాడుతూ "నా ఫస్ట్ మూవీ ఇది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రముఖులందరికి థాంక్యూ" అని అన్నారు.

హీరో రక్షిత్ మాట్లాడుతూ "తేజగారు చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. దర్శకుడు సాయి గారికి అద్భుతమైన విజన్ ఉంది. రెహమాన్ గారి శిష్యుడు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమా అవుతుంది. 'పలాస' తర్వాత 'నరకాసుర' అనే సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఇది మంచి ప్రేమకథ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మారుతి గారు - రఘు కుంచె గారు - శరత్ మరార్ గారు.. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని అన్నారు.   

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ "సినిమా టైటిల్ సెప్టెంబర్ లో అనౌన్స్ చేశాం. టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. రక్షిత్ గారు, కోమలి ప్రసాద్ గారి పెయిర్ చాలా బావుంది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇదే తొలి సినిమా. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాం" అని చెప్పారు.

కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ "ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్. ఈ చిత్రానికి పని చేస్తున్న అందరూ ఒకరికి ఒకరు తెలిసినవాళ్లే. సాయి మోహన్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు.. నేరేషన్ స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలకు ఓకే చెప్పేశా. నేరేట్ చేస్తున్నపుడే సినిమా కనిపించింది. తేజ గారు ప్రొడక్షన్ అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీ ఫీలయ్యా. వాళ్ల ఆఫీసులో సినిమాలో సాంగ్స్ రఫ్ ట్రాక్స్ విన్నాను. చాలా హ్యాపీ" అని అన్నారు.  

రక్షిత్ అట్లూరి - కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న 'శశివదనే' సినిమాలో సీనియర్ నటుడు శ్రీమాన్ - కన్నడ నటుడు ప్రిన్స్ దీపక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ శిష్యుడు శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాయికుమార్ దార సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.