Begin typing your search above and press return to search.

సర్కారు వారి 'ఐటెం' పాట అటా? ఇటా?

By:  Tupaki Desk   |   15 Feb 2022 9:30 AM GMT
సర్కారు వారి ఐటెం పాట అటా? ఇటా?
X
మహేష్‌ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా నుండి వచ్చిన మొదటి సింగిల్ యూట్యూబ్‌ లో సందడి చేస్తోంది. విడుదల అయిన రెండు రోజుల్లోనే 20 మిలియన్ ల వ్యూస్ తో పాటు మిలియన్ లైక్స్ కు చేరువ అయ్యింది. మహేష్ బాబును చాలా అందంగా చూపించడంతో పాటు కీర్తి సురేష్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా పాటలో చూపించారు.

ఈ పాటలో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్‌ ల విజువల్స్ కన్నుల విందుగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు పరశురామ్‌ ను మరోసారి మహేష్ బాబును అద్బుతంగా చూపించబోతున్నట్లుగా ఈ పాటను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఐటెం సాంగ్ అప్‌ డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయమై మేకర్స్ నుండి అనధికారికంగా క్లారిటీ వచ్చింది.

దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ ను పెట్టడం లేదట. తన గత చిత్రం గీత గోవిందం మాదిరిగానే సాఫీగా సాగుతూ స్క్రీన్ ప్లే నడుస్తుంది. అంతే తప్ప ఐటెం సాంగ్‌ ను బలవంతంగా జొప్పించాలని ఆయన భావించడం లేదట. కాని ఐటెం సాంగ్‌ కు ఏమాత్రం తగ్గకుండా ఒక మాస్ డ్యూయెట్‌ ను ఈ సినిమా లో పెట్టబోతున్నట్లుగా మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్‌ బాబు గత చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా ఇటీవల వచ్చిన ఎక్కువ శాతం సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయి. దాంతో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్‌ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సర్కారు వారి పాట సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ కావాలని అభిమానులు కోరుకున్నారు.

అభిమానుల కోరిక మేరకు సర్కారు వారి పాట సినిమాలో ఐటెం సాంగ్‌ ఉంటుందనే మీడియా వర్గాల్లో కూడా ప్రచారం జరిగింది. కాని సినిమాలో ఐటెం సాంగ్‌ ఉండదని మొదటి నుండి కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఐటెం సాంగ్‌ విషయంలో గత కొన్ని రోజులుగా ఊగిసలాటలో ఉన్న ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసినట్లే అనిపిస్తుంది. పాట ఉందా లేదా అనే అటా ఇటా ప్రశ్నకు సమాధానం లభించినట్లే అనిపిస్తుంది.

సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలోనే సినిమాకు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మహేష్‌ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదల అయ్యి రెండేళ్లకు పైగా అయ్యింది. కరోనా వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది.

సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ సినిమా అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను ఇస్తుందని దర్శకుడు హామీ ఇస్తున్నాడు. ఐటెం సాంగ్ లేదని మాస్ ఆడియన్స్ ఆవేదన చెందాల్సిన పని లేదు.. థమన్ తన మాస్ బీట్స్ తో ఒక ప్రత్యేక సాంగ్‌ ను ఇవ్వడం ఖాయం.. కనుక మహేష్‌ బాబు అభిమానులతో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా తో ఎంటర్‌ టైన్ అయ్యేందుకు రెడీ అవ్వచ్చు.