Begin typing your search above and press return to search.

సర్కారు వారి 'కళావతి' పాట సరికొత్త రికార్డ్..!

By:  Tupaki Desk   |   26 April 2022 6:30 AM GMT
సర్కారు వారి కళావతి పాట సరికొత్త రికార్డ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏ కంటెంట్ రిలీజ్ చేసినా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

'సర్కారు వారి పాట' చిత్రానికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చిన మూడు పాటలు ఇంస్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచి రికార్డు స్థాయి వీక్షణలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మ్యూజికల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టిన ఫస్ట్ సింగిల్ 'కళావతి'.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

'కళావతి' పాట ఇప్పటికే అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించిన ఫస్ట్ సింగిల్‌ గా అరుదైన ఘనతను సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు 150 మిలియన్ల వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు యూట్యూబ్ లో ఇప్పటివరకు 1.9M+ లైక్స్ రావడం విశేషంగా చెప్పవచ్చు.

ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన 'కళావతి' పాట.. వివిధ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్‌లలో అన్ని మ్యూజిక్ చార్ట్‌ లలో అగ్రస్థానంలో నిలిచింది. చాలా రోజులుగా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ లో టాప్ ట్రెండ్‌ లో ఉంది. థమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో ఆలపించారు. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు.

ఇందులో మహేష్ బాబు క్లాస్ అండ్ ఛార్మింగ్ డ్యాన్స్ మూవ్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ - కీర్తి జంట మధ్య మ్యూజికల్ కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఇక దీని తర్వాత వచ్చిన 'పెన్నీ' సాంగ్ మరియు టైటిల్ ట్రాక్ కూడా సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే త్వరలోనే 'సర్కారు వారి పాట' సినిమాలోని మాస్ సాంగ్‌ ని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అలానే పవర్ ఫుల్ ట్రైలర్ కట్ కూడా రెడీ అవుతోంది. వీటికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా.. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. మే 12 నుండి వరల్డ్ వైడ్ గా మహేష్ బాబు బాక్సాఫీస్ రికవరీ ప్రారంభం కానుంది.