Begin typing your search above and press return to search.

సంక్రాంతి వరకు ఆగండబ్బా..!

By:  Tupaki Desk   |   30 Nov 2021 6:24 AM GMT
సంక్రాంతి వరకు ఆగండబ్బా..!
X
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దగా అప్డేట్‌ ఏమీ ఇవ్వకుండానే వస్తున్నారు. పోస్టర్ మరియు గ్లిమ్స్ తో సర్కారు వారి పాట పై ఉన్న అంచనాలు భారీగా పెంచారు. అంతకు మించి ఈ సినిమా నుండి అప్డేట్ ఇవ్వక పోవడంపై మహేష్‌ బాబు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూవీ క్రియేషన్స్ వారిని రాధే శ్యామ్‌ అప్డేట్‌ ఇవ్వడం లేదు అంటూ ఎలా అయితే విమర్శించారో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారిని కూడా మహేష్ బాబు అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు.

సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుందని ఈ ఏడాది ఆరంభం నుండి చెబుతూ వచ్చారు. కాని మొన్నటికి మొన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా సంక్రాంతికి రాబోతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 1 కి వాయిదా వేయడం జరిగింది. ఒక వేళ జనవరి కే సినిమా వచ్చేది ఉంటే ఇప్పటి వరకు రెండు మూడు పాటలు టీజర్ ఇంకా వీడియోలు వచ్చేవి. కాని విడుదల తేదీ ఇంకా నాలుగు నెలలు ఉన్న కారణంగా మెల్లగా ప్రమోషన్ చేద్దాం అన్నట్లుగా మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. కాని అభిమానులు మాత్రం సర్కారు వారి పాట అప్‌డేట్‌ అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఆర్ ఆర్‌ ఆర్‌.. రాధే శ్యామ్‌.. భీమ్లా నాయక్‌.. పుష్ప.. ఆచార్య ఇలా అందరు స్టార్‌ హీరోలకు సంబంధించిన సినిమాల అప్‌డేట్‌ లు గత వారం పది రోజులుగా ఓ రేంజ్ లో సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. దాంతో సర్కారు వారి పాట అప్‌ డేట్‌ కోసం అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జనవరి వరకు ఎలాంటి అప్డేట్‌ ఉండదు. అప్పటి నుండి వరుసగా పాటలు మరియు ఏదో ఒక ప్రమోషనల్‌ వీడియోలు వస్తాయని చెప్పుకొచ్చారు. థమన్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సర్కారు వారి పాట నుండి మొదటి పాట జనవరిలో వస్తుందని హామీ ఇచ్చాడు. కనుక సర్కారు వారి పాట అప్ డేట్‌ కు జనవరి వరకు ఆగండబ్బా...

సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ మొదలు అయ్యింది మొదలు అనేక అనేక పుకార్లు షికార్లు చేస్తూ వస్తున్నాయి. సినిమా కథ గురించి.. కాన్సెప్ట్‌ గురించి పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. సినిమా కాన్సెప్ట్‌ ఏదైనా కథ ఏదైనా కూడా ఖచ్చితంగా అభిమానులను మెప్పించేలా ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. అలాంటి కీర్తి సురేష్‌ ఖచ్చితంగా సర్కారు వారి పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మహేష్‌ బాబు మరియు కీర్తిల కాంబో మంచి హిట్ పెయిర్ గా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.