Begin typing your search above and press return to search.

సర్కారు వారి ప్లానింగ్‌ లో మార్పులు!

By:  Tupaki Desk   |   30 Dec 2021 11:27 AM GMT
సర్కారు వారి ప్లానింగ్‌ లో మార్పులు!
X
మహేష్‌ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన సినిమా విడుదల వాయిదా వేయాల్సి రావడంతో పాటు మహేష్‌ బాబుకు చిన్న ఆపరేషన్‌ చేయాల్సి రావడం వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తుంది. సినిమా చివరి షెడ్యూల్‌ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు దుబాయిలో ఉన్నాడు. అక్కడే శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కనీసం రెండు నెలల సమయం అయినా మహేష్‌ బాబు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో ఫిబ్రవరిలో సర్కారు వారి పాట ను పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్‌ లో త్రివిక్రమ్‌ సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కాని ఇప్పుడు ప్లాన్‌ మారిందట.

ఆపరేషన్‌ తర్వాత మహేష్ బాబు చాలా స్పీడ్‌ గా కోలుకుంటున్నాడు. దాంతో మహేష్ బాబు షూటింగ్ కు కాస్త ముందుగానే జాయిన్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. మహేష్ బాబు ఫిబ్రవరి నుండే సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా నెల ముందుగానే సినిమా ను ముగించబోతున్నాడు. తద్వారా త్రివిక్రమ్‌ మూవీ కూడా ఒక నెల ముందే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సర్కారు వారి పాట ను మార్చి వరకు పూర్తి చేసి ఏప్రిల్‌ లో అనుకున్నట్లుగానే విడుదల చేయాలని దర్శకుడు పరశురామ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్‌ కూడా మహేష్ బాబుతో సినిమా ను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే ముగించాలని భావిస్తున్నాడు. అన్ని కుదిరితే 2022 లోనే మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఏడాది క్రితమే సంక్రాంతి కి సర్కారు వారి పాట వస్తుందని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాని ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ సినిమా లు విడుదల కాబోతున్న నేపథ్యంలో సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం లేదు అంటూ ప్రకటించారు. ఏప్రిల్‌ లో విడుదల విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మహేష్‌ బాబు సర్కారు వారి పాట చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఇక 2022 లో మహేష్ బాబు.. రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మహేష్ బాబుతో అనే విషయం తెల్సిందే.