Begin typing your search above and press return to search.

స‌ర్కార్ వారి షెడ్యూల్ మ‌రో కీల‌క మార్పు

By:  Tupaki Desk   |   15 Jan 2021 5:30 AM GMT
స‌ర్కార్ వారి షెడ్యూల్ మ‌రో కీల‌క మార్పు
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కార్ వారి పాట‌`. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. కీర్తి సురేష్ క‌థానాయిక‌. ఇటీవ‌ల రిలీజైన ప్రీలుక్ పోస్ట‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల అమెరికా షెడ్యూల్ ని హైద‌రాబాద్ కి మార్చిన సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. హైద‌రాబాద్ షెడ్యూల్ ని దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్నార‌ని తాజాగా వెల్ల‌డైంది. ఈ నెలాఖ‌రు నుంచి దుబాయ్ లో చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. ఆ త‌ర్వాతనే హైదరాబాద్ షెడ్యూల్ తెర‌కెక్కిస్తారు.

థ‌మ‌న్ ఇప్ప‌టికే బాణీల్ని రెడీ చేస్తున్నారు. అలాగే `స‌ర్కార్ వారి పాట`కు అదిరిపోయే బీజీఎంని థ‌మ‌న్ వ‌ర్క‌వుట్ చేస్తున్నారని తెలిసింది. మ‌హేష్ తో క‌లిసి మైత్రి మూవీ మేకర్స్ - 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.