Begin typing your search above and press return to search.

'సరిలేరు నీకెవ్వరు' అప్‌ డేట్

By:  Tupaki Desk   |   19 Oct 2019 6:05 PM GMT
సరిలేరు నీకెవ్వరు అప్‌ డేట్
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనీల్‌ సుంకర మరియు దిల్‌ రాజులు కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ను అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల్లో ఒక భారీ ఇంటి సెట్‌ వేశారు. దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ సెట్‌ ను నిర్మించారు.

ప్రకాష్‌ రాజ్‌ కు సంబంధించిన ఇంటి సెట్‌ ను నిర్మించి అందులో ఫైట్‌ సీన్‌ చిత్రీకరణ జరుపుతున్నారట. మహేష్‌ బాబుతో పాటు ముఖ్య నటీనటులు ఈ ఫైట్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మహేష్‌ బాబు ఆర్మీ మేజర్‌ పాత్రలో నటిస్తున్నాడు. కర్నూలు ఫ్యాక్షన్‌ కూడా ఈ చిత్రంలో ఉండబోతుందని మహేష్‌ బాబు తాజా పోస్టర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది.

మహర్షి చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న మహేష్‌ బాబు ఈ చిత్రంతో మరో సక్సెస్‌ ను దక్కించుకుంటాడనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎఫ్‌ 2 వంటి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న అనీల్‌ రావిపూడి ఈ చిత్రంతో మరో సక్సెస్‌ ను దక్కించుకుంటాడా చూడాలి. వచ్చే నెలాఖరికి సినిమా షూటింగ్‌ పూర్తి చేసేందుకు దర్శకుడు అనీల్‌ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.